ప్రభుత్వాలు, సంక్షేమ పథకాల్ని అందించేది ఖజానా నుంచి ఖర్చు చేసే నిధులతోనే. వాటికే బోల్డంత ప్రచారం అవసరమవుతోంది ఇటీవలి కాలంలో. కోట్లు ఖర్చు చేస్తున్నాయి ప్రభుత్వాలు ఈ ప్రచారం కోసం. ఇంకోపక్క, తమ సొంత మీడియా సంస్థల ద్వారా ఇచ్చుకునే అదనపు ప్రచారం కోసం, తెరవెనుకాల ఆమ్యామ్యాలు సరే సరి.
ఆ పార్టీ, ఈ పార్టీ అన్న తేడాల్లేవ్.. ఎవరు అధికారంలో వున్నా నడిచే పబ్లిసిటీ స్టంట్స్ దాదాపుగా ఒకేలా వుంటాయి. ఆయా మీడియా సంస్థల్లో పనిచేసినవారికి, తాము అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పదవులతో సత్కరించడం ఓ ఆనవాయితీగా తయారైంది. సరే, ఈ వ్యవహారాలు ఇప్పుడెందుకు.? అంటారా.! మెగాస్టార్ చిరంజీవి.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ బ్యాంకుల్ని ఏర్పాటు చేస్తున్నారు.
కరోనా నేపథ్యంలో ఆక్సిజన్ సమస్య తలెత్తడం, చాలామంది ఆక్సిజన్ దొరక్క ప్రాణాలు కోల్పోవడం తెలిసిన విషయమే. బాధితులకు ఆక్సిజన్ అందకపోవడమంటే, అది ప్రభుత్వాల వైఫల్యం. ఆ లెక్కన, ఆక్సిజన్ అందక ఎవరు చనిపోయినా.. అది ప్రభుత్వ హత్యగానే భావించాలి. ఆ రాజకీయ వ్యవహారాల్ని పక్కన పెడితే, చిరంజీవి ఇప్పటికే బ్లడ్ మరియు ఐ బ్యాంక్ నిర్వహిస్తున్నారు.
తాజాగా ఆక్సిజన్ బ్యాంకుల్ని ఏర్పాటు చేశారు. ఓ వ్యక్తి, ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రజల్ని ఆదుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకొస్తే, అలాంటి వ్యక్తిని ప్రభుత్వాలు ప్రోత్సహించాలి కదా.? సరే, ప్రభుత్వాలు ప్రోత్సహించలేదు.. మీడియా మాటేమిటి.? సోనూ సూద్ సాయం చేస్తున్నాడు.. చిరంజీవి ఏం చేస్తున్నాడు.? చేపల పులుసు వండుతున్నాడా.? అని విమర్శించిన మీడియా సంస్థలు, కొందరు రాజకీయ నాయకుల నోళ్ళు ఇప్పుడెందుకు పెగలడంలేదు.? కరోనా నేపథ్యంలో ప్లాస్మా చికిత్సకి డిమాండ్ పెరిగింది.. చిరంజీవి బ్లడ్ మరియు ఐ బ్యాంక్ నుంచి పెద్దయెత్తున ప్లాస్మా డొనేషన్లు జరిగాయి.
చిరంజీవి అభిమానుల్లో చాలామంది స్వచ్ఛందంగా ప్లాస్మా డొనేషన్స్ చేశారు. కానీ, ఇవేవీ ప్రచారానికి నోచుకోలేదు. అయినా, ప్రచారం కోసం చేసేవి అయితే పబ్లిసిటీ కోసం పాకులాడాలేమోగానీ.. ఆ అవసరమైతే చిరంజీవికి లేదు. చిరంజీవి ఓ వైపు ఇలా స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు చేస్తోంటే, జనసేన పార్టీ తరఫున జనసైనికులు గత కొద్ది రోజులుగా అవసరమైనవారికి ఇంటివద్దకే ఆక్సిజన్ సిలెండర్లను అందిస్తున్నారు.. అదీ సొంత ఖర్చులతో.
నిజానికి, మొదటి వేవ్ సమయంలో కూడా చాలా ప్రభుత్వ ఆసుపత్రులకు ఆక్సిజన్ సిలెండర్లు అందించారు జనసైనికులు. అలా గత ఏడాది జనసైనికులు సమకూర్చిన ఆక్సిజన్ సిలెండర్లు ఈ ఏడాది చాలామంది కరోనా బాధితుల ప్రాణాల్ని కాపాడాయి. అవేవీ కొందరు రాజకీయ నాయకులకి, మీడియాకి కనిపించవు. ఎందుకంటే, వాళ్ళ కళ్ళన్నీ రాజకీయ పార్టీల జెండాలతో కప్పివేయబడ్డాయి మరి.
24651 583530I surely did not realize that. Learnt some thing new these days! Thanks for that. 908270