రెబెల్ స్టార్ ప్రభాస్ నుండి ఈరోజు ఒక సర్ప్రైజ్ అప్డేట్ వచ్చిన విషయం తెల్సిందే. తన్హాజి వంటి భారీ చిత్రాన్ని తెరకెక్కించిన బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించబోయే భారీ చిత్రం ఆది పురుష్ లో ప్రభాస్ లీడ్ రోల్ లో నటించబోతున్న సంగతి తెల్సిందే. ఈరోజు ఉదయమే దీనికి సంబంధించిన అప్డేట్ విడుదలైంది. ఇది పూర్తిగా 3డి లో తెరకెక్కబోయే యాక్షన్ డ్రామా. భారతీయ ఇతిహాసాలలో ప్రాముఖ్యమైన రామాయణం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందని అర్ధమవుతోంది. హిందీ, తెలుగులో రూపొందనున్న ఈ చిత్రాన్ని తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఎగ్జైట్ అవుతూ మంచు లక్ష్మి ట్వీట్ చేసింది. ఈ చిత్రం గురించి చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. మన భారతీయ ఇతిహాసం సినిమా రూపంలో రావడం నిజంగా అద్భుతం అని మంచు లక్ష్మి ట్వీట్ చేయగా ఒక ట్విట్టర్ యూజర్ మంచు లక్ష్మిని ట్యాగ్ చేస్తూ దర్శకుడు ఓం రౌత్ ను ఈ సినిమాలో శూర్పణఖ పాత్రకు నిన్ను తీసుకోమని సూచిస్తున్నా అని చెప్పాడు. దానికి మంచు లక్ష్మి నేను సిద్ధమే. ఈ ప్రాజెక్టు కోసం ఎక్కడ సంతకం చేయాలి అని తన ఉత్సాహాన్ని తెలిపింది.
ఇంతకీ ఈ సినిమాలో కాస్టింగ్ ఏ రేంజ్ లో ఉండబోతోందో చూడాలి.
Hey @LakshmiManchu ; I suggesting my director @omraut to rope into this project for the character of Surpanakha.
Wait for the next official announcement of #Adipurush https://t.co/rUDHdHiVxB
— Om Raut (@OmRaut_) August 18, 2020