మెగా కాంపౌండ్ మీద నిత్యం జరిగే ట్రోలింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇలా ట్రోలింగ్ చేయడానికే ప్రత్యేకంగా అనధికారికంగా లక్షలు ఖర్చు చేస్తున్నారు.. కాదు కాదు.. కోట్లు ఖర్చు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఎవరికి ఆ అవసరం అన్నది బహిరంగ రహస్యమే.
ట్విట్టర్, ఫేస్బుక్, వెబ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా.. ఇలా అన్నిటిలోనూ మెగా కాంపౌండ్కి వ్యతిరేకంగా కథనాలు ఏళ్ళ తరబడి వస్తూనే వున్నాయి. అంతలా మెగా కాంపౌండ్ మీద విషం చిమ్మి ఏం సాధిస్తున్నారు.? అన్నది వేరే చర్చ.
అసలు విషయంలోకి వస్తే, మంచు కుటుంబం 10 కోట్ల పరువు నష్టం దావా.. అంటూ హెచ్చరికలు జారీ చేసేసింది. ‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమా గురించీ అలాగే సినీ పరిశ్రమలో నడుస్తున్న రాజకీయాల గురించీ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ నడుస్తోంది.
ఈ మొత్తం వ్యవహారంపై మంచు ఫ్యామిలీ సీరియస్ అయ్యింది. కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారన్నది మంచు కాంపౌండ్ ఆరోపణ. వాళ్ళెవరో కూడా తమకు తెలుసని స్వయంగా మోహన్ బాబు చెప్పారు. అయితే, వాళ్ళ వివరాలు మాత్రం వెల్లడించలేదు.
ఎవరో తెలిసినప్పుడు, నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేస్తే సరిపోతుంది కదా.? ఈ పరువు నష్టం దావా హెచ్చరిక దేనికి.? నిజమే, సోషల్ మీడియాలో జరుగుతున్న విద్వేషపూరిత ట్రోలింగ్ అస్సలేమాత్రం సమంజసం కాదు. అది ఏ హీరో మీద, ఏ హీరోయిన్ మీద జరిగినా క్షమార్హం కాదు.
అయితే, సోషల్ మీడియాలో ఇదంతా సర్వసాధారణమైపోయింది. పెద్ద హీరోలు, చిన్న హీరోలు.. నటీమణులు.. ఎవరైనాగానీ, ఈ ట్రోలింగ్ నుంచి తప్పించుకోలేకపోతున్నారు. ఆ విషయం పక్కన పెడితే, పనిగట్టుకుని ఓ కుటుంబాన్ని టార్గెట్ చేయడం ప్రముఖులకు తగునా.? మెగా కాంపౌండ్ మీద నడుస్తున్న విద్వేష రాజకీయానికి, విష ప్రచారానికీ సోకాల్డ్ మేధావులు ఏం సమాధానం చెబుతారు.?
119027 783641I enjoy your writing style actually enjoying this web internet site . 475381