సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమాలు రెండూ సెన్సార్ పూర్తి చేసుకున్నాయి. రెండింటికి ‘యు/ఏ’ సర్టిఫికెట్ వచ్చింది. అలాగే రెండూ సంక్రాంతికే రిలీజ్ అవుతున్నాయి కానీ ఇప్పటికీ సినిమా రిలీజ్ డేట్స్ పై మాత్రం క్లారిటీ లేదు.
ముందుగా ఒకే డేట్ అనుకోని ఆ తర్వాత రాజీకి వచ్చిన వారు జనవరి 11ని మహేష్ బాబు, జనవరి 12ని అల్లు అర్జున్ బుక్ చేసుకున్నారు. మళ్ళీ మార్పులు చేసి జనవరి 10న రెండు బాక్స్ ఆఫీస్ వద్ద తలపడడానికి సిద్ధమయ్యాయి. దాంతో రిలీజ్ డేట్ పై క్లారిటీ లేక డిస్ట్రిబ్యూటర్స్ గుండెమీద చెయ్యి పెట్టుకొని రిలీజ్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు.
అందులో భాగంగా మళ్ళీ ఈ రోజు ఇరు టీంల మధ్యా చర్చలు జరుగనున్నాయి. దిల్ రాజు సరిలేరు నీకెవ్వరు సినిమాకి ఒక నిర్మాతే కాకుండా ఆ చిత్ర నైజాం హక్కులని కూడా 33 కోట్లకి కొన్నారు. అలాగే అల వైకుంఠపురములో సినిమా వైజాగ్/ఉత్తరాంధ్ర రైట్స్ ని 26 కోట్లకి కొనుగోలు చేసాడు. సో రెండు సినిమాలు ఒకే రోజు వస్తే రెండు సినిమాలకి నష్టమే, అంతే కాకుండా దిల్ దిల్ రాజుకి డిస్ట్రిబ్యూటర్ గా పెద్ద దెబ్బ తగిలే అవకాశం మెండుగా ఉంది మరియు థియేటర్స్ సమస్య భారీగా ఉంటుంది.
అందుకే ఇప్పుడున్న ప్రపోజల్ ఏమిటంటే.. సరిలేరు నీకెవ్వరు జనవరి 11న రిలీజయ్యి, 12న రిలీజ్ కాబోయే అల వైకుంఠపురములో సినిమాకి 12న నైజాంలో 60% థియేటర్స్ ఇస్తాను అంటే రెండు సినిమాలు ఒకే రోజు రిలీజయ్యే క్లాష్ ఉండకపోవచ్చు. ఆ కండిషన్ కి ఒప్పుకోకపోతే మాత్రం పంతానికి పోయి రెండు సినిమాలు ఒకే రోజు అనగా జనవరి 10నే వచ్చే అవకాశం ఉంది. మరి ఇప్పుడు ఇరు హీరోలు అండ్ టీమ్స్ పంతానికి పోయి ఛాలెంజ్ లు విసురుకుంటారా? లేక డిస్ట్రిబ్యూటర్స్ శ్రేయస్సు కోరి రాజీకి వస్తారా అనేది చూడాలి. ఏ నిర్ణయమైనా ఈ రోజు లేదా రేపటిలోపే వచ్చే అవకాశం ఎక్కువ ఉంది.
90993 523399Some really great information , Gladiola I identified this. 63160
766304 294581Id always want to be update on new weblog posts on this web site , bookmarked ! . 301098