సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా కాలం సస్పెన్స్ తర్వాత వెల్లడించిన సినిమా సర్కారు వారి పాట. పరశురామ్ దర్శకత్వంలో తన 27వ సినిమాగా ఈ చిత్రాన్ని చేయనున్నాడు మహేష్. ముందుగానే ఈ చిత్రాన్ని మొదలుపెట్టాలని భావించినా అనుకున్నా కరోనా కారణంగా చిత్ర పనులు లేట్ అయ్యాయి. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. దర్శకుడు పరశురామ్ ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసే పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే థమన్ సంగీతం దర్శకుడిగా ఎంపికవ్వగా, సినిమాటోగ్రాఫర్ గా పీఎస్ వినోద్ పనిచేయనున్నారు. ఇక మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మహేష్ కూడా ఒక నిర్మాణ భాగస్వామిగా ఉంటాడు.
ఈ చిత్రం గురించిన తాజా సమాచారం ప్రకారం సర్కారు వారి పాట షూటింగ్ ను సెప్టెంబర్ నుండి మొదలుపెట్టాలని భావిస్తున్నారు. ఈలోగా షూటింగ్స్ కు పరిమితులు రావడంతో పాటు షూటింగ్ ఎలా చేయాలన్న విషయంలో ఒక క్లారిటీ కూడా వస్తుంది. అలాగే ప్రీ ప్రొడక్షన్ పనులను పక్కాగా పూర్తి చేసుకోవచ్చు. అందుకని సెప్టెంబర్ అయితే బెటరని మూవీ యూనిట్ ఫీలైనట్లు సమాచారం.
ఇక ఈ చిత్రంలో నటించే హీరోయిన్ విషయంలో సస్పెన్స్ అలాగే కొనసాగుతోంది. మొదట కియారా అద్వానీని అనుకున్నా డేట్స్ విషయంలో ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఇప్పుడు దబాంగ్ 3 భామ సాయీ మంజ్రేకర్ ను అప్రోచ్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా పూర్తి క్లారిటీ మరికొద్ది రోజుల్లో రానుంది.
50604 279410You produced some decent points there. I looked more than the internet for any difficulty and discovered most individuals goes as well as along with your internet site. 499451
195895 498373Hey! Great post! Please do tell us when we can see a follow up! 892116
851189 323531Maintain up the great piece of function, I read few posts on this internet web site and I think that your web weblog is actually interesting and contains lots of superb data. 823221