అద్బుతమైన ఫీచర్స్ తో వాట్సప్ మాయలో వినియోగదారులు పడిపోయారు. ఒక్క యాప్ ఎన్నో సర్వీస్ లను ఇస్తున్న నేపథ్యంలో మరో ఆలోచన లేకుండా వాట్సప్ ను వినియోగిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 200 కోట్ల వాట్సప్ వినియోగదారులు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఫిబ్రవరి 8 వ తారీకు నుండి వాట్సప్ కొత్త ప్రైవసీ పాలసీని తీసుకు వచ్చింది. ఈ పాలసీలో మనకు సంబంధించిన మొత్తం వివరాలను వాట్సప్కు తెలియజేయాల్సి ఉంటుంది.
మనం ఆ కొత్త ప్రైవసీ పాలసీకి ఓకే చెప్పినట్లయితే మనం వాడే మొబైల్ ఫోన్ మోడల్ నుండి మొదలుకుని మనం ఏ నెట్వర్క్ లో ఉన్నాం, మనం వాడే నెట్ ఐపీ అడ్రస్ ఇలా అన్ని విధాలుగా వాట్సప్ తెలుసుకుంటుంది. ఇది ఖచ్చితంగా ప్రమాదకరం అంటూ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) వాదిస్తుంది. ఈ కొత్త ప్రైవసీ పాలసీని కేంద్రం అడ్డుకోవాలని ఈ సంస్థ కోరుతుంది. ఇది కనుక అమలులోకి వస్తే ఖచ్చితంగా దేశ భద్రతకే ముప్పు ఉంటుంది. కనుక ఆ కొత్త ప్రైవేసీ పాలసీ అడ్డుకోవాలి లేదంటే ఆ యాప్ ను ఇండియాలో బ్యాన్ చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోడీకి సీఏఐటీ లేఖ రాసింది. దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.
515626 808418It is actually a cool and useful piece of details. Im glad that you shared this helpful info with us. Please keep us informed like this. Thanks for sharing. 88033
906932 457213Hey, are you having issues along with your hosting? I required to refresh the page about million times to get the page to load. Just saying 520813