ఆమె పేరు స్వాతి.. కాని ఇప్పటి వరకు ఆమె పది పేర్లను మార్చుకుని ఎన్నారైలను మోసం చేస్తూ లక్షల రూపాయలను లాగింది. ఎంతో మందిని బురిడీ కొట్టించిన స్వాతి ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడింది. ఎంబీఏ చదివిన తెలివితో ఏదైనా ఉద్యోగం చేసుకోకుండా ఇలా మోసాలకు ఉపయోగించిన స్వాతి తెలివికి పోలీసులు సైతం నోరు వెళ్లబెడుతున్నారు. విలాసవంతమైన జీవితం కోసం పెళ్లి అయిన తర్వాత కూడా పెళ్లి కోసం వరుడు కావాలంటూ మ్యాట్రమోనీలో ప్రకటనలు ఇచ్చి వేరే అమ్మాయిల ఫొటోలను ఉపయోగించింది. దాంతో ఈమె వలలో ఎంతో మంది పడ్డారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లా కొవ్వూరు మండలం రంగనాయకుల పేట గ్రామంకు చెందిన స్వాతి ఎస్వీ యూనివర్శిటీలో ఎంబీఏ పూర్తి చేసింది. లెక్చరర్ గా పని చేసే దుర్గ ప్రవీణ్ తో ఈమె వివాహం జరిగింది. హైదరాబాద్ లో ఉంటున్న వీరు విలాసవంతమైన జీవితంను కోరుకున్నారు. అందుకోసం స్వాతి అక్రమ సంపాదన మొదలు పెట్టింది. స్వాతి తనకు ఉన్న టెక్నికల్ నాలెడ్జ్ తో విదేశాల్లో ఉంటున్నట్లుగా ఒక విదేశీ నెంబర్ ను తయారు చేసింది. మ్యాట్రిమోనీలో ఆ నెంబర్ పెట్టి చాలా మందిని నమ్మించింది. అబ్బాయితో తాను మాట్లాడకుండా తన కుటుంబ సభ్యులను మాట్లాడిస్తున్నట్లుగా వాయిస్ మార్చి మాట్లాడేది. దాంతో చాలా మంది నమ్మి పెళ్లికి సిద్దం అయ్యే వారు. అలా చాలా మందిని నమ్మించి మెల్లగా డబ్బులు వసూళ్లు చేసేది. పెళ్లి వత్తిడి తేవడంతో ఆమె ఫోన్ ఆఫ్ చేసేది. పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది, స్వాతిని పోలీసులు అరెస్ట్ చేశారు.
526660 928518Thanks for this amazing post! It has long been very useful. I wish that you will carry on posting your wisdom with us. 451190
987084 514606I dont normally have a look at these kinds of websites (Im a pretty shy person) – but even though I was a bit shocked as I was reading, I was definitely a bit excited as effectively. Thanks for giving me a big smile for the day 48038