ఏపీ మంత్రి కొడాలి నానికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయన మీడియాతో మాట్లాడటానికి న్యాయస్థానం అనుమతించింది. అయితే, ఎస్ఈసీ, ఎన్నికల ప్రక్రియపై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని స్పష్టంచేసింది. ఇటీవల నాని మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఈనెల 21 వరకు మీడియాతో మాట్లాడటానికి వీల్లేదని పేర్కొంటూ ఎస్ఈసీ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో వాటిని సవాల్ చేస్తూ నానీ హైకోర్టుకు వెళ్లారు.
దానిపై బుధవారం విచారణ జరిపిన న్యాయస్థానం.. భావప్రకటన స్వేచ్ఛకు సంబంధించిన కీలకమైన ఈ విషయంలో లోతైన విచారణ జరగాల్సి ఉందని అభిప్రాయపడింది. ఇరువర్గాల వాదనలతోపాటు ప్రభుత్వ వాదనను కూడా విన్న న్యాయస్థానం.. మధ్యేమార్గంగా గురువారం తగిన ఉత్తర్వులు జారీచేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ అంశంపై ఉత్తర్వులు వెలువరించింది.
292890 29621hi and thanks for the actual blog post ive lately been looking regarding this specific advice on-line for sum hours these days as a result thanks 901183
865377 398299Woh I enjoy your posts , bookmarked ! My wife and i take issue along along with your last point. 510425
871970 729343hi, your internet site is genuinely very good. I truly do appreciate your give excellent outcomes 515856
185646 130820Made to measure curtains […]check out the web sites listed below, worth a read for interiors and rugs enthusiasts[…] 158120