Switch to English

కేజీఎఫ్‌ డైరెక్టర్‌ తెలుగు డెబ్యూ ఇప్పట్లో లేనట్లేనా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

కన్నడ చిత్రం కేజీఎఫ్‌ తో ఆల్‌ ఇండియా గుర్తింపు దక్కించుకున్న డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌. ఈయన ప్రస్తుతం కేజీఎఫ్‌ 2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఆ తర్వాత తెలుగులో ఎన్టీఆర్‌తో ఈయన మూవీ ఉంటుందని గత ఏడాది కాలంగా ప్రచారం జరుగుతోంది. ప్రశాంత్‌ నీల్‌ ఇటీవల ఎన్టీఆర్‌ బర్త్‌ డేకు శుభాకాంక్షలు చెప్పడంతో వీరిద్దరి కాంబో అతి సమీపంలోనే ఉందని అంతా అనుకున్నారు. కాని పరిస్థితులు చూస్తుంటే ఎన్టీఆర్‌ ప్రశాంత్‌ నీల్‌ చిత్రం ప్రారంభంకు కనీసం ఏడాది నుండి రెండేళ్ల వరకు అయినా సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు.

ఎన్టీఆర్‌ ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాన్ని పూర్తి చేయాలి. ఆ తర్వాత త్రివిక్రమ్‌ మూవీని కూడా ఆయన చేయాల్సి ఉంది. త్రివిక్రమ్‌ తో మూవీ అయిన తర్వాత ఎన్టీఆర్‌ తదుపరి చిత్రాన్ని ప్రశాంత్‌ నీల్‌ చేస్తాడని అంటున్నారు. మరో వైపు ప్రశాంత్‌ నీల్‌ కూడా ప్రస్తుతం కేజీఎఫ్‌ 2 బాధ్యతలు మోస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ హడావుడిగా పూర్తి చేయాలేని పరిస్థితి. ఇలాంటి సమయంలో సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సంజయ్‌ దత్‌ క్యాన్సర్‌ కారణంగా అమెరికా ట్రీట్‌మెంట్‌కు వెళ్లబోతున్నాడు. ఆయన తిరిగి వచ్చే వరకు కేజీఎఫ్‌ పూర్తి అయ్యే అవకాశం లేదంటున్నారు.

కేజీఎఫ్‌ 2 చిత్రం షూటింగ్‌ పూర్తి అయినా కన్నడంలో ఇప్పటికే ప్రశాంత్‌ కొన్ని కమిట్‌మెంట్స్‌ను కలిగి ఉన్నాడు. కనుక వాటిని కూడా చేసే అవకాశం ఉందంటున్నారు. అదే కనుక నిజం అయితే తెలుగులో ఎన్టీఆర్‌తో ప్రశాంత్‌ నీల్‌ మూవీ ఇప్పట్లో ప్రారంభం అవ్వడం కష్టమే అంటున్నారు. ప్రశాంత్‌ నీల్‌ స్టార్‌ డంతో ఆయనతో సినిమాలు చేసేందుకు మహేష్‌బాబు, ప్రభాస్‌, చరణ్‌ వంటి స్టార్స్‌ కూడా ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్‌తో సినిమా ఫలితాన్ని బట్టి వారి సినిమాలు కూడా ఉంటాయనుకున్నారు. కాని ఎన్టీఆర్‌ సినిమానే ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలియని పరిస్థితి.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...