అయిపోయింది.! ఈ మాట జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడో అనేయొచ్చు. కానీ, ఆగారు.. ఆలోచించారు.! చివరికి, అనేయక తప్పలేదు.! పవన్ కళ్యాణ్ అన్నారనడం కాదు, ఆ మాట అనిపించుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
ప్రత్యేక హోదా ఎందుకు రాలేదు.? అన్న ప్రశ్నకి, ‘పవన్ కళ్యాణ్ నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు’ అనే సమాధానం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చింది.
పోలవరం ప్రాజెక్టు ఎందుకు పూర్తి కాలేదు.? అన్న ప్రశ్నకి, ‘పవన్ కళ్యాణ్, కార్లు మార్చినట్లు పెళ్ళాలు మార్చుతాడు’ అనే సమాధానమే వైసీపీ నుంచి దూసుకొచ్చింది.
ప్రశ్న మద్య నిషేధం గురించి అయినా, ఇంకోటైనా.. ఏ ప్రశ్నకైనా వైసీపీ నుంచి ఒకటే సమాధానం.! మంత్రులు అంబటి రాంబాబు, రోజా తదితరులైనా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్
రెడ్డి అయినా.. ఎవరైనా, ఒకటే మాట.. ‘పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ వ్యవహారం’.!
మూడు పెళ్ళిళ్ళు, అందులో రెండు విడాకులు.. నాలుగో పెళ్ళాం ఎక్కడ.? నాలుగో పెళ్ళాం నువ్వేనేమో జగన్.. రా..! అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తాడేపల్లి గూడెంలో టీడీపీ – జనసేన కలిసి నిర్వహించిన బహిరంగ సభ వేదికగా, స్ట్రైకింగ్ కామెంట్ చేశారు.
‘నీ వ్యక్తిగత జీవితం గురించి నాకు తెలుసు.. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర నీ బాగోతాలేంటో నాకు ఆ చిట్టా తెలుసు.. టన్నుల కొద్దీ సమాచారం వుంది..’ అంటూ జనసేనాని పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విరుచుకుపడ్డారు.
‘పాతాళానికి తొక్కేస్తా.. వామనుడి లాంటోడ్ని నేను. నా శక్తిని తక్కువ అంచనా వేయొద్దు.. నువ్వు ఆపలేని యుద్ధాన్ని నీకిస్తాను జగన్..’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
మిగతా రాజకీయ ప్రసంగమంతా ఎలా వున్నా, ‘నాలుగో పెళ్ళాం’ అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు మింగలేక కక్కలేక నానా తంటాలూ పడుతున్నాయి. ఇకనైనా, జగన్ బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి మాట్లాడటం మానేస్తారేమో వేచి చూడాలి.!