జనసేన 10వ ఆవిర్భావ సభకు పార్టీ సన్నాహకాలు ప్రారంభించింది. ఈమేరకు పార్టీ ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ అధికారికంగా వెల్లడించారు. ‘మార్చి 14న పార్టీ ఆవిర్భావ దినోత్సవం మచిలీపట్నంలో నిర్వహిస్తున్నాం. మంగళగిరిలోని పార్టీ కార్యాలయం నుంచి మచిలీపట్నంకు పవన్ కల్యాణ్ వారాహి వాహనంలో వస్తారు. రాష్ట్ర భవిష్యత్తు, ప్రజల్లోకి వెళ్లేలా, వైసీపీని ఇంటికి సాగనంపే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం’.
‘ఆవిర్భావ సభకు పొట్టి శ్రీరాములు వేదకగా నామకరణం చేశాం. 34 ఎకరాల్లో సభకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. భద్రతాపరంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం. వరదల సమయంలో పవన్ కల్యాణ్ అక్కడ పర్యటించి రైతులకు అండగా నిలిచారు. నాడు ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులకు గురి చేసింది’.
‘పవన్ ఇక్కడ సభ నిర్వహించాలని ప్రజలు కోరారు. పింగళి వెంకయ్య, సుభాష్ చంద్రబోస్ వంటి మహనీయుల్ని స్మరించుకుంటాం. వ్యక్తిగతంగా అవమానాలు ఎదురైనా ప్రజల కోసం పవన్ నిలబడ్డార’ని అన్నారు. మాజీ మంత్రి పేర్ని నాని నియోజకవర్గం కావడంతో ఈసారి పొలిటికల్ హీట్ మరింత పెరుగుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
మచిలీపట్నం వేదికగా మార్చి 14న జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవం
మంగళగిరి నుండి మచిలీపట్నం సభా వేదికకు వారాహి వాహనంలో రానున్న జనసేనాని శ్రీ @PawanKalyan గారు pic.twitter.com/zcmMYIdJlH
— JanaSena Party (@JanaSenaParty) March 1, 2023
570823 675077Following examine a couple of with the weblog posts within your site now, and I truly like your manner of blogging. I bookmarked it to my bookmark website list and may be checking back soon. Pls take a look at my site as effectively and let me know what you think. 90032
242036 698431How a lot of an significant content, maintain on penning significant other 412331