Switch to English

Janasena: ఇరవై నాలుగు ప్లస్ మూడు.! జనసేనకి సరిపోతాయా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

88,942FansLike
57,764FollowersFollow

టీడీపీ – జనసేన పొత్తులో భాగంగా జనసేన పార్టీకి 24 అసెంబ్లీ సీట్లనీ, 3 లోక్ సభ సీట్లనీ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కేటాయించగలిగారు. ఇలా అనడం కరెక్టా.? గెలిచే అవకాశం 98 శాతం వున్న 23 అసెంబ్లీ సీట్లు, 3 లోక్ సభ సీట్లను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకున్నారని అనడం సబబా.?

ఎవరెలాగైనా అనుకోవచ్చు. కానీ, 98 శాతం స్ట్రైక్ రేట్ ముఖ్యం.. అని జనసేనాని ఇటీవల వ్యాఖ్యానించారు.. పొత్తులో భాగంగా తీసుకోబోయే సీట్ల విషయమై. ‘మనం టీడీపీ వెనుక నడవడంలేదు.. టీడీపీతో కలిసి నడుస్తున్నాం..’ అని కూడా చెప్పారు జనసేనాని.

జనసేన శ్రేణులు, 75 సీట్లను ఆశించాయి. కనీసం 60 అయినా వస్తాయని జనసేనలో చాలామంది అనుకున్నారు. కాదు కాదు, 40 నుంచి 45 మధ్య రావొచ్చన్న సంకేతాలూ కనిపించాయి. కానీ, ఈ ఇరవై నాలుగు సీట్ల లెక్కేంటి.?

మూడు ఎంపీ సీట్లు అంటే చిన్న విషయం కాదు.! ఆయా నియోజకవర్గాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాల్ని కలుపుకుంటే.. అది పెద్ద వ్యవహారమే. కానీ, అలా కలపలేం కదా.!

2019 ఎన్నికల్లో జనసేన గెలిచింది ఒకే ఒక్క సీటు. జనసేన అధినేత రెండు చోట్లా ఓడిపోయారు. ఓటమి నుంచి జనసేన పాఠాలు నేర్చుకుంది. స్థానిక ఎన్నికల్లో కాస్త బలాన్ని గట్టిగానే చాటుకుంది.

టీడీపీ – జనసేన గెలిస్తే ఏమవుతుందో అధికార వైసీపీకి తెలుసు. అందుకే, పొత్తుని చెడగొట్టడానికి మేగ్జిమమ్ ప్రయత్నిందిగానీ కుదరలేదు.

60 సీట్లు తీసుకుని, 50 శాతం స్ట్రైక్ రేట్ సాధిస్తే ప్రయోజనమేంటి.? పోనీ, 75 శాతం స్ట్రైక్ రేట్ సాధిస్తేనో.! జనసేన ఓట్ల శాతం పెరుగుతుంది ఓవరాల్‌గా.. దీని వల్ల జనసేనకు అదనంగా కలిగే ప్రయోజనం ఏమీ లేదు.

చట్ట సభల్లోకి 24 ప్లస్ 3 అనే నెంబర్‌తో జనసేన ఎంటర్ అయితే, ఆ తర్వాత ఈక్వేషన్స్ అనూహ్యంగా మారిపోతాయ్. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. 24 మంది ఎమ్మెల్యేలతో జనసేనాని గేమ్ ఛేంజర్ అయినా అవ్వొచ్చు. జనసేన శ్రేణులు, ముందు ఆ 24 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను గెలిపించడంపై ఫోకస్ పెట్టాల్సి వుంది.

సినిమా

బిగ్ బాస్ 9లో షాకింగ్ ట్విస్ట్: రీతూ చౌదరి ఎలిమినేషన్

బిగ్ బాస్ తెలుగు 9 ఈ వారం నిజంగా ప్రేక్షకులను కుర్చీ అంచులకు చేర్చే షాక్ ఇచ్చింది. అందరి ఊహలకు పూర్తిగా విరుద్ధంగా, యాంకర్‌గా మంచి...

BIGG BOSS 9 TELUGU E91: కల్యాణ్, ఇమ్మానియేల్, తనూజ.. ముందుకి;...

బిగ్ బాస్ సీజన్ 9 శనివారం నాటి 91వ ఎపిసోడ్ లో.. హోస్ట్ నాగార్జున స్టేజ్ ఎంట్రీతోనే మూడ్ హైపరైపోయింది. మొదటి ఫైనలిస్ట్ అయిన కల్యాణ్‌ను...

“ఇట్స్ ఓకే గురు” అందరికీ కనెక్ట్ అయ్యే ఫీల్-గుడ్ సినిమా: మెహర్...

‘ఇట్స్ ఓకే గురు’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ ఆనందంగా జరిగింది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, పాటలు మంచి స్పందన తెచ్చుకోవడంతో... ఈ సందర్భంగా మాట్లాడిన అతిథులు,...

సావిత్రి పాత్రల్లో ఆమె మహత్తు చిరస్మరణీయం: వెంకయ్య నాయుడు

మహానటి సావిత్రి 90వ జయంతి వేడుకలు హైదరాబాద్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించబడ్డాయి. సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి ఆధ్వర్యంలో ‘సంగమం ఫౌండేషన్’ చైర్మన్ సంజయ్ కిషోర్...

అఖండ 2 – వీరమల్లు రచ్చ ఎందుకు? బాలయ్య–పవన్ పోలికపై హాట్...

‘అఖండ’ తర్వాత భారీ క్రేజ్‌తో ఎదురు చూసిన ‘అఖండ 2 తాండవం’ చివరి నిమిషంలో వాయిదా పడడంతో సోషల్ మీడియాలో ఊహాగానాలు పెద్ద ఎత్తున మళ్లీ...

రాజకీయం

సంచలన వీడియో : మహా పాపం చేశానని రోదించిన రవి కుమార్

పరకామణి కేసులో నిందితుడిగా నిలిచిన రవి కుమార్ పేరు మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఇటీవల ప్రెస్ మీట్‌లో సీఎం జగన్ “ఇది చిన్న చోరీ మాత్రమే” అని వ్యాఖ్యానించగా, ఆ మాటలపై రవి...

జగన్ వ్యాఖ్యలు శ్రీవారి భక్తుల మనోభావాలకు దెబ్బ : మీడియాతో చంద్రబాబు

అమరావతిలోని ఎన్టీఆర్ భవన్‌లో సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతల వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. బాబాయ్ హత్యలాంటి ఘోరమైన ఘటననే చిన్న విషయంగా తీసుకున్న వాళ్లు, తిరుమల పరకామణి సమస్యపై నైతికత...

పరకామణి చోరీపై ఆనం ఘాటు విమర్శలు… జగన్ వ్యాఖ్యలపై తీవ్రమైన ఆగ్రహం

టీటీడీ పరకామణి చోరీ ఘటనపై మంత్రివర్గ సభ్యుడు ఆనం రాంనారాయణరెడ్డి మరోసారి వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చిన్న వ్యవహారంగా చెప్పి భక్తుల విశ్వాసాలను తక్కువ చేసి మాట్లాడడం బాధాకరమని...

చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీ కి సహకరించిన నారా భువనేశ్వరి

హైదరాబాద్ నుంచి జంగారెడ్డిగూడెంకు ప్రయాణిస్తున్న సందర్భంగా ఖమ్మం జిల్లా సరిహద్దులోని నాయికన్ గూడెం చెక్ పోస్ట్ వద్ద జరిగిన ఒక చిన్న సంఘటన ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా...

ప్రతిపక్ష హోదా అడగడం కన్నా జగన్.. అసెంబ్లీకి రావాలి: తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి హితవు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం కీలకంగా భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, పరస్పర సహకారం,...

ఎక్కువ చదివినవి

ఏపీ లిక్కర్ స్కాం: నిందితులకు ఏసీబీ కోర్టులో పెద్ద ఎదురుదెబ్బ

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు ఏసీబీ కోర్టు భారీ ఎదురుదెబ్బ ఇచ్చింది. ఈ కేసులో అరెస్టయిన నిందితులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వెంకటేష్ నాయుడు, నవీన్ కృష్ణ, బాలాజీ యాదవ్ దాఖలు చేసిన...

అఖండ 2 రిలీజ్ వాయిదా – కొత్త తేదీ త్వరలో: నిర్మాతల నుంచి అప్ డేట్

అఖండ 2 కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్న అభిమానులకు నిర్మాతలు నిన్న రాత్రి లేట్‌గా ఒక ముఖ్యమైన అప్‌డేట్‌ను వెల్లడించారు. సినిమా విడుదల కోసం టీమ్ తమ వంతు ప్రయత్నం అంతా చేసినప్పటికీ,...

“మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంధ్రప్రదేశ్ నా ఆత్మభూమి”: బాలకృష్ణ

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ – బ్లాక్‌బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ ఎక్స్‌ట్రావగాంజా ‘అఖండ 2: తాండవం’ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5, 2025న...

అఖండ 2కి అకస్మాత్తు బ్రేక్: భారీ షాక్‌కు గురైన అభిమానులు, ఇండస్ట్రీ

అఖండ 2 విడుదలపై అర్ధరాత్రి వచ్చిన ఆకస్మిక ప్రకటన తెలుగు చిత్ర పరిశ్రమను, బాలకృష్ణ అభిమానులను తీవ్ర నిరాశలోకి నెట్టింది. నిర్ణయించిన తేదీకి సినిమా విడుదల కావట్లేదని. మేకర్స్ “భారీ మనస్సుతో” ప్రకటించడం...

స్మృతి–పలాష్ పెళ్లి పై కుటుంబం క్లారిటీ

స్మృతి మంధానా–పలాష్ ముచ్చల్ పెళ్లి మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. నవంబర్ 23న జరగాల్సిన ఈ హైప్రొఫైల్ వివాహం, స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధానా అకస్మాత్తుగా అస్వస్థతకు గురవడంతో వాయిదా...