Switch to English

జగన్ చేస్తోంది.. బాబు చేయనిది ఇదే!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై ఆయా ప్రాంతాలవారీగా భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ఏపీకి దక్షిణాఫ్రికా తరహాలో మూడు రాజధానులు రావొచ్చేమో అంటూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేయడం.. అనంతరం రాజధానిపై ఏర్పాటైన జీఎన్ రావు కమిటీ అదే విధంగా నివేదిక ఇవ్వడంతో ఈ మార్పులు అనివార్యంగా జరగడం ఖాయమని దాదాపుగా నిర్ధారణ అయిపోయింది. దీంతో అమరావతి ప్రాంతంలో నిరసనలు, ఆందోళనలు సాగుతుండగా.. ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో ఆనందోత్సాలు వ్యక్తమవుతున్నాయి.

వాస్తవానికి ఇలాంటి కీలకమైన అంశాలు అమలు చేయాలనుకున్నప్పుడు ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించి ఆయా పార్టీల సూచనలు, అభ్యంతరాలు స్వీకరించడం ఆనవాయితీ. ఇలాంటి అంశాల్లో తప్పనిసరిగా ప్రతిపక్షాలను కూడా విశ్వాసంలోకి తీసుకోవాల్సిందే. కానీ గతంలో అధికారోంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఇది పాటించలేదు. అప్పుడు విపక్షంగా ఉన్న వైఎస్సార్ సీపీని ఏ అంశంలోనూ పరిగణనలోకి తీసుకోలేదు. ముఖ్యంగా రాజధాని ఏర్పాటుపై టీడీపీ పెద్దలే నిర్ణయం తీసుకుని ప్రకటించేశారు.

రాష్ట్రానికి సంబంధించి ఎంతో కీలకమైన ఈ విషయంలో ప్రతిపక్ష అభిప్రాయం తీసుకోకుండా తమకు నచ్చినట్టు చేశారు. అయితే, అప్పుడు చంద్రబాబు చేసిన ఇలాంటి పొరపాటును జగన్ చేయడంలేదు. రాజధాని మార్పుపై అన్ని పార్టీల అభిప్రాయాలూ తీసుకోవాలని నిర్ణయించారు. రాజధాని మార్పుల విషయంలో జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించి ఆమోదించేందుకు ఈనెల 27న కేబినెట్ సమావేశమవుతోంది. అనంతరం జనవరి 2న ఇదే అంశంపై ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సర్కారు నిర్ణయించింది.

ఈ భేటీకి తెలుగుదేశం పార్టీతోపాటు జనసేన, బీజేపీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలను ఆహ్వానించనున్నారు. వాస్తవానికి అసెంబ్లీలో టీడీపీ, జనసేనకు మాత్రమే ప్రాతినిధ్యం ఉంది. అయినప్పటికీ అన్ని పార్టీల ప్రతినిధులనూ ఈ భేటీకి పిలివాలని అధికార పక్షం యోచిస్తోంది. రాజధాని మార్పును టీడీపీ, జనసేన, సీపీఐ వ్యతిరేకిస్తుండగా.. బీజేపీ స్వాగతించింది. సీపీఎం ఇంకా తన వైఖరి స్పష్టంచేయలేదు. ఇక సరైన నాయకత్వం లేకపోవడం వల్ల దీనిపై ఏ వైఖరి తీసుకోవాలో కాంగ్రెస్ తేల్చుకోలేకపోతోంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...