ప్రాంతీయ పార్టీల్లో పార్టీ అధినేతను దేవుడిగా చూస్తూ ఉంటారు. అలా చూస్తేనే పార్టీలో ప్రాముఖ్యత ఉంటుంది. పార్టీ అధినేత దృష్టిలో పడేందుకు చాలా కష్టపడుతూ ఉంటారు. పార్టీలో ఉన్న నాయకులు మరియు కార్యకర్తలు అంతా కూడా అధినేత నామ జపం చేస్తూ ఉంటారు. ఏపీ అధికార పార్టీ వైకాపాలో కూడా అధినేత పూజ అంతా ఇంతా ఉండదు అనడంలో సందేహం లేదు. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి పదే పదే మంత్రులు ఎమ్మెల్యేలు పొగడ్తల వర్షం కురిపిస్తూనే ఉంటారు.
తాజాగా శ్రీకాళహస్తికి చెందిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సీఎం వైఎస్ జగన్ కు ఆలయం కట్టేశాడు. ఏకంగా రెండు కోట్లు పెట్టి ఆలయాన్ని నిర్మించిన ఆ ఎమ్మెల్యే ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాడు. తనకు సీఎం జగన్ పై ఉన్న అభిమానంతో పాటు ఆ గుడిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను కూడా చూపించే విధంగా నిర్మాణం జరిగింది. గుడి నిర్మాణంలో 75 శాతం వరకు తన సొంత డబ్బును ఖర్చు పెట్టిన ఎమ్మెల్యే మిగిలిన 25 శాతంను పార్టీ కార్యకర్తల నుండి విరాళాల రూపంలో తీసుకున్నాడట. ఈ గుడి ని చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున అక్కడకు వెళ్తున్నారు.
150357 982651As soon as I discovered this internet site I went on reddit to share some of the love with them. 472486