వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్రంతో సయోధ్యతోనే ఉంటున్నారు. కేంద్రంలో అన్నిరకాల బిల్లులకు జగన్ మద్దతు ఇస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. పౌరసత్వం విషయంలో కూడా వైఎస్ జగన్ మద్దతు పలికారు. ఇంతవరకు బాగానే ఉన్నది. అయితే, ఎన్ఆర్సి విషయంలో మొన్నటి వరకు అనుకూలంగా ఉన్న జగన్ ఇప్పుడు సడెన్ గా వ్యతిరేకంగా తన స్వరాన్ని వినిపిస్తున్నారు. ఎన్ఆర్సికి మద్దతు ఇవ్వబోమని ఈరోజు అయన కడపలో పేర్కొన్నారు.
రాయలసీమలో మెజారిటి రెడ్డి, నాయడు వర్గాలు అయినప్పటికీ, ముస్లింలు కూడా భారీ సంఖ్యలో ఉన్నారు. రెడ్డి, నాయుడు తరువాత ముస్లింలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వారి ఓటు బ్యాంక్ వైకాపాకు చాలా అవసరం. గత ఎన్నికల్లో వైకాపాకు మైనారిటీ వర్గం నుంచే ఎక్కువగా ఓటు బ్యాంక్ లభించింది. రాజకీయాల్లో నిలబడాలి అంటే రాజకీయాలు చేయాలి. ఈ విషయం జగన్ కు బాగా తెలుసు.
అందుకే పౌరసత్వం బిల్లుకు ఆమోదం తెలిపిన జగన్… ఎన్ఆర్సి విషయంలో మాత్రం వ్యతిరేకించేందుకు సిద్ధం అయ్యారు. ఈ విషయాన్నీ జగన్ ఈరోజు కడపలో రిమ్స్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన తరువాత ఎన్ఆర్సి గురించి మాట్లాడారు. మైనారిటీల సంక్షేమం తమకు చాలా అవసరం అని, మైనారిటీలకు అండగా ఉంటామని జగన్ అంటున్నారు. వారి కోసమే ఈ ఎన్ఆర్సికి మద్దతు ఇవ్వబోమని అంటున్నాడు జగన్. మరి దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.
203301 872374Beging with the entire wales well before just about any planking. Our own wales can easily compilation of calculated forums those thickness analysts could be the comparable to some of the shell planking along with a lot more significant damage so that they project right after dark planking. planking 322641
759842 205376I got what you intend, saved to fav, really nice internet site . 113415
611282 890335I like this web site so much, saved to favorites . 397048