ఎన్నికల ఫలితాల విడుదలకు కౌంట్ డౌన్ మొదలైంది. సరిగ్గా 6 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఆదివారం చివరి విడత పోలింగ్ పూర్తికాగానే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలవుతాయి. ఇప్పటికే తమ విజయావకాశాలపై పార్టీలన్నీ దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చాయి. అందుకు అనుగుణంగానే భవిష్యత్ కార్యాచారణపై దృష్టి సారించాయి. ఫలితాలు రాకముందే తమకు అక్కరకు వచ్చే అవకాశం ఉందని భావించే పార్టీలకు కాంగ్రెస్, బీజేపీలు గేలం వేస్తున్నాయి. ఈ విషయంలో యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ స్వయంగా రంగంలోకి దిగారు.
బీజేపీ కంటే ఓ అడుగు ముందుకు వేసి, ఫలితాలు విడుదలయ్యే ఈనెల 23న యూపీఏ అనుకూల, తటస్థ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆ భేటీకి రావాలంటూ ఆయా పార్టీల అధినేతలకు లేఖలు రాశారు. ఇందులో భాగంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కూడా ఆమె ఆహ్వానం పంపినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే, వీటిని ఆయా పార్టీలు ఖండించాయి. తమకు కాంగ్రెస్ నుంచి ఎలాంటి ఆహ్వానం అందలేదని స్పష్టంచేశాయి. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు కాంగ్రెస్ తో అంటకాగుతున్న నేపథ్యంలో కేసీఆర్, జగన్ ఆ భేటీకి వెళ్లే అవకాశం లేదని అంటున్నారు. ఇద్దరికీ శత్రువు అయిన చంద్రబాబు ఉండే కూటమిలోకి వెళ్లడానికి ఎట్టిపరిస్థితుల్లోనూ వారికి ఇష్టం ఉండదని చెబుతున్నారు.
అంతేకాకుండా ఫలితాలు పూర్తి స్థాయిలో వెల్లడైన తర్వాత, అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని ఈ ఇరువురు నేతలు భావిస్తున్నట్టు సమాచారం. సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని, ఆంధ్రప్రదేశ్ లో 18 నుంచి 20 సీట్లు వైఎస్సార్ సీపీ గెలుస్తుందని అంచనాలు ఉన్నాయి. ఈ రెండు పార్టీలను కలుపుకొంటే కనీసం 32 నుంచి 34 సీట్లు చేతిలో ఉన్నట్టే. ఈసారి కేంద్రంలో హంగ్ ఏర్పడటం ఖాయమనే ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో ఈ రెండు పార్టీల మద్దతు ఎవరికి ఉంటే వారే అధికారం చేజిక్కించుకునే అవకాశం ఉంటుంది.
ఈ నేపథ్యంలోనే అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ కూడా టీఆర్ఎస్, వైఎస్సార్ సీపీలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాల్లో బిజీగా ఉన్న కేసీఆర్.. ప్రస్తుతానికి వాటికి ఫుల్ స్టాప్ పెట్టినట్టు సమాచారం. ఇటీవల డీఎంకే అధినేత స్టాలిన్ తో భేటీ అంతగా పలప్రదం కాకపోవడంతో ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాలని నిర్ణయం తీసుకున్నట్టుగా చెబుతున్నారు. ఇక జగన్ అయితే, తొలి నుంచి చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. తర్వాత పెద్దగా ఎక్కడా కనిపించలేదు. విజయం వైసీపీదే అంటూ ఎన్ని సర్వేలు వచ్చినా ఆయన మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఎవరికీ అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడంలేదు. ఏ విషయమైనా ఫలితాలు వచ్చాక మాట్లాడుకుందాం అని స్పష్టంచేస్తున్నట్టు సమాచారం.
గత ఎన్నికల్లో విజయం తమదే అని అతి విశ్వాసం కనబరచడం.. ఫలితాలు విరుద్ధంగా రావడంతో, ఈ సారి ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. ఎక్కడా తొందరపడకుండా, ఫలితాలు వచ్చాక చూద్దామనే ధోరణినే జగన్ కంటిన్యూ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే యూపీఏ భేటీకి వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఫలితాలు వచ్చిన తర్వాత, అప్పటి పరిణామాలను బట్టి స్పందించాలన్నది జగన్ వ్యూహంగా చెబుతున్నారు. మొత్తమ్మీద గత ఎన్నికల్లో చేసిన ఏ పొరపాటునూ పునరావృతం కానీయకుండా ఆయన ఆచితూచి అడుగులు వేస్తున్నారని అర్థమవుతోంది.
732963 644582Wonderful post nevertheless , I was wanting to know in case you could write a litte more on this topic? Id be very thankful should you could elaborate a little bit further. Bless you! 400197
589400 833278hi and thanks regarding the particular post ive truly been looking regarding this kind of information online for sum time these days hence thanks a whole lot 638808
674708 233412I cannot thank you fully for the blogposts on your web page. I know you placed a great deal of time and effort into all of them and hope you know how considerably I appreciate it. I hope I will do precisely exactly the same for yet another individual at some point. Palm Beach Condos 555246