వైఎస్ జగన్ 2019 లో జరిగిన ఎన్నికల్లో 151 స్థానాల్లో విజయం సాధించారు. ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో భారీ మెజారిటీ అని చెప్పాలి. ఈ స్థాయిలో గత ఎన్నికల్లో బాబుకు కూడా రాలేదు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి అన్ని నేను చూసుకుంటాను.. నేను విన్నాను… నేను విన్నాను అని చెప్పిన జగన్ ను నమ్మి ప్రజలు ఓటు వేశారు. గెలిచిన తరువాత అనేక పధకాలు రూపొందించి ప్రజలు చేరువయ్యేందుకు ప్రయత్నం చేశారు.
ప్రజల్లో రాజశేఖర్ రెడ్డి కంటే మంచి సీఎం అనే పేరు తెచ్చుకుంటున్నాడులే అనుకుంటున్న సమయంలో శీతాకాల సమావేశం చివరి రోజున జగన్ పేల్చిన బాంబు ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యింది. రాజధాని భగ్గుమన్నది. ఆంధ్రుల రాజధానిగా ఇప్పటికే అందరు అమరావతిని ఫిక్స్ అయ్యారు. గత ప్రభుత్వం 33 వేల ఎకరాల భూమిని సేకరించింది. కొంతమేర కట్టడాలు నిర్మించింది. అయితే, అదే సమయంలో ఎన్నికలు రావడంతో ప్రభుత్వం మారిపోయింది. అప్పట్లో జగన్ కూడా అమరావతికి జై కొట్టారు.
ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల తరువాత అమరావతిని కాదని చెప్పి విశాఖలో కార్యనిర్వాహక రాజధానిని ఏర్పాటు చేయబోతున్నారు. అక్కడి నుంచే పాలనలో 70శాతం జరుగుతుంది. అమరావతిలో అసెంబ్లీ, మంత్రులు, రాజ్ భవన్, హైకోర్టు బెంచ్ ఉంటాయి. అంటే పాలన అక్కడి నుంచి ఏమి జరగదు. దీంతో ఆ ప్రాంతం మరలా 2014 కు ముందులా మారిపోతుంది. అలా ఉన్న పర్వాలేదు. భూములను చదును చేసి పంటలు పండేందుకు వీలులేకుండా చేశారు. ఇప్పుడు ఆ భూముల్లో తిరిగి పంటలు పండించుకోవాలి అన్నా కుదరని పని.
రాజధాని గ్రామాలుగా ఉన్న 29 గ్రామాల్లో ప్రజలు భగ్గుమన్నారు. ఆంధ్రప్రదేశ్ కు విజయవాడ, గుంటూరు జిల్లాలు రాజకీయాలకు బలమైన జిల్లాలు. ఈ జిల్లాల్లో గత ఎన్నికల్లో వైకాపా మంచి విజయం సాధించింది. ఆరు నెలల తరువాత జగన్ కు ఉన్న పేరు మొత్తం ఐదు రోజుల్లో చెడగొట్టుకున్నాడు. ఇదే కంటిన్యూ అయితే.. వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రజలు ఖచ్చితంగా గద్దె దించుతారు అనడంలో సందేహం అవసరం లేదు.
393569 230942Ill appropriate away grasp your rss feed as I cant in finding your email subscription hyperlink or e-newsletter service. Do youve any? Please let me understand so that I may possibly subscribe. Thanks. 249292
706004 251811I would like to see much more posts like this!.. Excellent blog btw! reis Subscribed.. 784800
412787 624381Wow ~ Great stuff ~ Come and have a look at MY ?? 951213