తిరుపతి.. ప్రముఖ ఆధ్మాత్మిక నగరం. ఇటీవల జరిగిన లోక్ సభ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో తిరుపతి చుట్టూ జరిగిన రాజకీయాలు ఏ స్థాయిలో నైతిక విలువల్ని దిగజార్చేశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రజాస్వామ్యం సిగ్గుపేడలా ఫేక్ ఓటర్లు తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో రెచ్చిపోయారు.
‘తిరుపతి ఉప ఎన్నిక మెజార్టీ.. రికార్డు స్థాయిలో వుండాలి.. దేశమంతా తిరుపతి ఉప ఎన్నిక ఫలితం గురించి మాట్లాడుకునేలా వుండాలి..’ అంటూ అప్పట్లో అధికార పార్టీ పెద్దలు నినదించారు. నిజమే, ఆ స్థాయిలోనే ఫేక్ ఓటర్ల గురించి దేశమంతా చర్చించుకుంది.. తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో. మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి తిరుపతి గురించి దేశం మాట్లాడుకుంటోంది.
దేశమంటే, వైసీపీ ఆరోపించే తెలుగుదేశం పార్టీ కాదు.. ఇది భారతదేశం. భారతదేశమంతా, తిరుపతి గురించే మాట్లాడుకోవడానికి కారణం, తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ సమస్య తలెత్తి 11 మంది ప్రాణాలు కోల్పోవడమే. ‘వైఎస్ జగన్ కేర్స్..’ అంటూ సోషల్ మీడియా వేదికగా నిన్న మొన్నటిదాకా తమ ప్రభుత్వ పాలనను మెచ్చుకున్న వైసీపీ కార్యకర్తలు కూడా నిన్నటి తిరుపతి రుయా ఘటనపై స్పందించలేక బిక్కచచ్చిపోయారు. జరిగిన ఘోరం అలాంటిది మరి.
ఆక్సిజన్ పేరుతో సింగపూర్ అంటున్నారు.. ఇంకేవేవో కథలు చెబుతున్నారు అధికార పార్టీ నేతలు. ప్రతిరోజూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, కరోనా పరిస్థితిపై సమీక్షిస్తూనే వున్నారు. కానీ, ఈ సమస్య ఎలా తలెత్తింది.? ఆక్సిజన్ విషయమై అధికారులెందుకు అంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు.? అన్న ప్రశ్నలకు మాత్రం సమాధానం దొరకడంలేదు.
ఆక్సిజన్ సమస్య తలెత్తిన వెంటనే, ఆదుకోవాల్సిన డాక్టర్లు అందుబాటులో లేరంటూ బాధిత కుటుంబాలు గగ్గోలు పెడుతున్నాయి. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు, సంతాపం వ్యక్తం చేయడమో.. చర్యలు తీసుకుంటామనో ప్రకటిస్తే సరిపోదు. పుష్కరాల్లో తొక్కిసలాట చంద్రబాబు ప్రభుత్వ హత్య అయితే.. తిరుపతి రుయా ఘటన ఎవరి ఖాతాలో.?
437517 507417Some truly nice and beneficial info on this website, likewise I conceive the style holds outstanding functions. 346735
544061 866316I really like your writing style truly enjoying this internet internet site . 156824