ఇంట్లో ఎక్కువగా రాగి పాత్రలను వినియోగించడం ద్వారా కరోనా వైరస్ ను అరికట్టవచ్చని సౌతాంప్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్ధారిస్తున్నారు. తాము చేసిన పరిశోధనల్లో ఈ విషయం తేటతెల్లమైందని ఎన్విరాన్మెంటల్ హెల్త్కేర్ విభాగం ప్రొఫెసర్ బిల్ కీవిల్ వివరిస్తున్నారు. రాగి, ఇత్తడి మిశ్రమంతో తయారుచేసిన వస్తువులపై కరోనా వైరస్ త్వరగా చనిపోతుందని అంటున్నారు.. ఈ సమయంలో రాగి వస్తువులు ఉపయోగించడం శ్రేష్టమని చెప్తున్నారు.
నీటిని సహజసిద్ధంగా శుద్ధి చేసే రాగికి ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. రాగి గ్లాసుల్లోనే నీళ్లు తాగడం మంచిదని చెప్తున్నారు. నిజానికి మన దేశంలో రాగి గ్లాసలు, చెంబులు ఉపయోగించడం ఎక్కువ. గతంలో భారతీయుల ఇళ్లలో ఎక్కువగా రాగి వస్తువులే ఉండేవి. రాగి పాత్రల్లో వంటలు, భోజనం చేయడం చేసేవారు. కానీ ప్రస్తుతం వాటి వినియోగం తగ్గింది. రాగి పాత్రలో నీరు తాగితే బ్యాక్టీరియా, ఫంగస్ దరిచేరవనే పరిశోధనలు కూడా తేల్చాయి.
రాత్రంతా రాగిపాత్రలో నిల్వ చేసిన నీటిని ఉదయాన్నే తాగితే శరీరంలోని విషపదార్థాలు బయటకు పోతాయని వైద్యనిపుణులు చెప్తూ ఉంటారు. ఈ విషయాలన్నింటికీ ఊతమిస్తున్నాయి శాస్త్రవేత్తల పరిశోధనలు. రోజువారీ ఉపయోగించే వస్తువులు కూడా రాగి పూత ఉంటే మంచిదంటున్నారు. డోర్ హ్యాండిల్స్, రెయిలింగ్ వంటి వాటికి రాగిపూత ఉంటూ వైరస్ దరి చేరే అవకాశం ఉండదంటున్నారు.
రాగి పాత్రలు వాడకంతో గుండె సమస్యలు, క్యాన్సర్, శరీర బరువు తగ్గించడం, యవ్వనంగా కనిపించడం, రక్తహీనత రాకుండా చేస్తుంది. థైరాయిడ్, ఆర్థరైటిస్ను అదుపులో ఉంచుతుంది. ఇమ్యూనిటీ సిస్టంను బలోపేతం చేస్తూ ఎములకు బలాన్నిస్తుందని నిపుణులు అంటున్నారు.
387200 858671really nice put up, i actually adore this web web site, maintain on it 837522
322078 226745This is something I really need to try and do plenty of analysis into, thanks for the post 962443