ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పటికీ దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే. దాదాపు నెల రోజులపాటు హోరాహోరీగా ప్రచారం జరగ్గా నవంబర్ 30న తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. తాజాగా ఇండియా టుడే తన ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలను వెల్లడించింది. అన్ని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు చెప్పినట్లే ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ సత్తా చాటుతుందని తెలిపింది. కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య ప్రధాన పోటీ నెలకొంటుందని చెప్పింది. రాష్ట్రంలో ఆ పార్టీ 42 శాతం ఓటు షేర్ తో 68 సీట్లను గెలుచుకుంటుందని చెప్పింది.
ఇక భారతీయ రాష్ట్ర సమితి 36% ఓటు షేర్ తో 39 సీట్లు సంపాదిస్తుందని తెలిపింది. దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ కి 51 శాతం, బీఆర్ఎస్ కి 35% ఓటు షేర్ లభిస్తుందని చెప్పింది. మధ్య తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ కి 49 శాతం ఓటు షేర్ దక్కనున్నట్లు చెప్పగా అధికార బీఆర్ఎస్ 36 శాతం ఓటు షేర్ గెలుచుకుంటుందని పేర్కొంది. హైదరాబాద్ లో బీఆర్ఎస్ 11 సీట్లు, కాంగ్రెస్ 3 సీట్లు గెలుచుకుంటుందని పేర్కొంది.
తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు గాను నవంబర్ 30న పోలింగ్ జరిగింది. 70.60 శాతం ఓటింగ్ నమోదు అయినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది