తమిళనాడు లోని ఓ ఆలయంలో భారీగా గుప్త నిధులు బయటపడ్డాయి. ఆలయంలో మరమ్మతు పనులు నిర్వహిస్తుండగా భారీగా బంగారు ఆభరణాలు లభ్యమయ్యాయి. కాంచీపురం జిల్లా ఉత్తిరమేరూర్ లోని కుళంభేశ్వర ఆలయంలో జీర్ణోద్ధరణ పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మూలవిరాట్టు సన్నిధి ఎదుట ఉన్న రాతి మెట్లను జేసీబో తొలగిస్తుండగా.. ఓ వస్త్రపు మూట బయటపడింది.
దానిని విప్పి పరిశీలించగా.. భారీగా బంగారు ఆభరణాలు, నగలు కనిపించాయి. అవన్నీ కలిపి వంద సవర్లకు పైగా ఉంటుందని అంచనా వేశారు. ఈ విషయం తెలియడంతో రెవెన్యూ అధికారులు, పోలీసులు అక్కడకు వెళ్లారు. కానీ బంగారు ఆభరణాలను వారికి అప్పగించడానికి స్థానికులు నిరాకరించారు.
అనంతరం కాంచీపురం ఆర్డీవో తదితరులు వెళ్లి ఆలయ నిర్వాహకులతో మాట్లాడారు. మహాకుంభాభిషేకం చేసే సమయంలో ఆ ఆభరణాలు, నగలను ఆలయానికి తీసుకురావాలనే షరతు మీద వాటిని అధికారులకు అప్పగించారు. రెండో కులోత్తుంగ చోళన్ కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్టు చెబుతున్నారు. అప్పట్లో నగల భద్రత కోసం ఇలా మందిరం గోడలు, ఇతర ప్రాంతాల్లో దాచి ఉంచేవారని.. అదే ఇప్పుడు బయటపడిందని అభిప్రాయపడుతున్నారు.
955468 904288Hi there! Great stuff, please do tell me when you lastly post something like that! 676856
392552 527762Attractive part of content. I just stumbled upon your website and in accession capital to claim that I acquire in fact enjoyed account your weblog posts. Any way Ill be subscribing to your feeds and even I achievement you get entry to constantly speedily. 669662
312768 638533Hey! Excellent post! Please do tell us when we can see a follow up! 457554
913952 396844I like this post, enjoyed this one regards for posting . 501474