దేశంలో కోవిడ్ తీవ్రత.. మరణాల తీవ్రత ఏస్థాయిలో ఉందో తెలిపే ఘటన బెంగళూరులో జరిగింది. ఇప్పటివరకూ సినిమా ధియేటర్లకు మాత్రమే పరిమితమైన ‘హౌస్ ఫుల్’ బోర్డులు ఇప్పుడు నగరంలోని స్మశానం గేట్లకు పెట్టడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. బెంగళూరులో రోజువారీ కరోనా మృతుల సంఖ్య పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే 217 మంది మృతి చెందారు. నగరంలోని 14 స్మశానాలు రోజూ కరోనా మృతదేహాలతో కిటకిటలాడిపోతున్నాయి. మృతదేహాలు భారీగా వస్తూండటంతో శ్మశాన వాటిక నిర్వాహకులు అంత్యక్రియలు చేయలేకున్నారు.
దీంతో బెంగళూరులోని పలు శ్మశానవాటికలు ‘హౌస్ఫుల్’ బోర్డులు తగిలిస్తున్నాయి. చామ్రాజ్పేటలోని శ్మశాన వాటికలోని గేటుకు ఇలా ‘హౌస్ఫుల్’ బోర్డు తగిలించారు. రోజుకు 20కి పైగా మృతదేహాలు వస్తున్నట్టు నిర్వాహకులు అంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వం అంత్యక్రియల కోసం 230 ఎకరాల అదనపు స్థలాన్ని కేటాయించింది. మృతుల కుటుంబీకులకు సొంత ప్లాట్లు, ఫామ్హౌస్, పొలాలు ఉంటే అక్కడే అంత్యక్రియలు చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. కర్ణాటకలో నిన్న ఒక్కరోజే 37,733 కేసులు నమోదయ్యాయి.
489268 667304Hey mate, .This was an superb post for such a hard topic to speak about. I look forward to seeing numerous a lot more outstanding posts like this one. Thanks 73199
470000 175970Respect to post author, some fantastic information . 5025