హిందూపురం ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 8 మంది మృతి చెందడంపై ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించారు. ప్రభుత్వ వైఫల్యానికి ఈ మరణాలు నిదర్శనంగా నిలుస్తున్నాయని మండిపడ్డారు. సరైన మానిటరింగ్, ముందు జాగ్రత్త చర్యలు, అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగానే ఇంతమంది ప్రాణాలు కోల్పోయారని బాలకృష్ణ అన్నారు. ఇది చాలా బాధాకరమైన విషయమన్నారు. ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని.. రాష్ట్రంలో ఎటు చూసినా చావు కేకలు వినిపిస్తున్నాయని అన్నారు.
మృతుల కుటుంబసభ్యులకు ప్రభుత్వం 25 లక్షలు ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత, భౌతిక దూరం పాటించాలని కోరారు. హిందూపురం కోవిడ్ ఆస్పత్రిలో మెరుగైన వైద్యం అందించాలని వెంటిలేటర్లు, వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయాలని మంత్రి, కలెక్టర్, డీఎంఅండ్హెచ్ఓతో మాట్లాడానని బాలకృష్ణ తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్లో నెలకొన్న అభద్రతా భావాన్ని పారద్రోలి.. బాధితులకు సరైన వైద్య సౌకర్యం అందించాలని బాలకృష్ణ కోరారు.
46589 96627Superb post but I was wanting to know in case you could write a litte far more on this subject? Id be very thankful in the event you could elaborate just a little bit far more. Thanks! 933502
This piece of writing is genuinely a pleasant one it helps new web users, who are wishing for blogging.
673658 631526Hi my loved 1! I wish to say that this post is incredible, fantastic written and come with almost all crucial infos. I would like to see more posts like this . 267339