సంక్రాంతి వస్తుంది అంటే ఎక్కడెక్కడి వారంతా పల్లెటూరికి చేరిపోతారు. ముఖ్యంగా గోదావరి జిల్లాలకు చేరుకుంటారు. ఒకప్పుడు సంక్రాంతి రోజున అనేక పోటీలు పెడుతుంటారు. ముగ్గుల పోటీ నుంచి కోడి పందేల వరకు ఎన్నో రకాల పండుగలు నిర్వహిస్తుంటారు. పల్లెటూరిలో నిర్వహించే ఈ సంక్రాంతి పందేలకు గ్రామీణ ఒలంపిక్స్ అని కూడా పిలుస్తుంటారు. అయితే, గతంలో సంక్రాంతి రోజున నిర్వహించే ఇలాంటి పందేలు ఇప్పుడు కమర్షియల్ గా మారిపోయాయి.
రాజకీయ రంగులు పులుముకుంటున్నాయి. ముఖ్యంగా కోడిపందేలు పౌరుషానికి ప్రతీకగా నిర్వహిస్తారు. రాజుల కాలం నుంచి గోదావరి జిల్లాల్లో ఈ పందేలు నిర్వహిస్తుంటారు. కానీ, ఈ పందేలు ఇప్పుడు డబ్బు కోసం, హోదా కోసం జరుగుతున్నాయి. ఈ పందేల పేరుతో కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతున్నది. దీనిని చాలామంది ఓ వ్యాపారంగా మలుచుకుంటున్నారు.
సంవత్సరం మొత్తం పందెం కోళ్లను పెంచడంలోనే మునిగిపోతున్నారు చాలామంది. రెండు కోళ్లు బరిలోకి దిగాయి అంటే దాని చుట్టూ కోట్లాది రూపాయల పందేలు జరుగుతుంటాయి. సరదాగా మొదలైన ఏ కోడి పందేలు గ్యాంబ్లింగ్ పద్దతిగా మారడంతో ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టింది. ఈ పందేలను ఆపాలని, వీటిని అరికట్టాలని ప్రభుత్వం అంటోంది.
కానీ, ప్రజలు మాత్రం ఇవి సంక్రాంతి సంస్కృతీ, సంప్రదాయాలకు కోడి పందేలు ప్రతీక అని, వాటిని ఎట్టిపరిస్థితుల్లో నిర్వహించి తీరుతామని అంటున్నారు. దీంతో ఈ కోడి పందేల చుట్టూ రాజకీయంగా ఉచ్చు బిగుసుకుంటోంది. వైకాపా నాయకులు కూడా ప్రజల అభీష్టం మేరకు ఈ పందేలు నిర్వహిస్తామని చెప్పడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. మరి పందేలను ప్రభుత్వం ఖచ్చితంగా నిర్వహిస్తుందా చూడాలి.
493482 591210I got what you mean , saved to my bookmarks , quite good web site . 266029
859661 371532There is noticeably a great deal to know about this. I believe you created some nice points in capabilities also. 270713