Switch to English

ఇదేమి చిత్రం: జీతాలివ్వమని కోర్టు చెబితే.. అది తప్పంటారేంటీ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,422FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌లో చిత్ర విచిత్రమైన రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. కరోనా వైరస్‌ నేపథ్యంలో రాష్ట్రం, దేశం, ప్రపంచం ఆర్థిక ఇబ్బందుల్లో వున్న మాట వాస్తవం. ఆదాయం వచ్చే మార్గాలు కన్పించక ప్రభుత్వాలు అప్పులు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ కూడా రికార్డు స్థాయిలో అప్పులు చేయాల్సి వస్తోంది. నెలవారీ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికే నానా తంటాలూ పడుతోంది. చిత్రంగా సంక్షేమ పథకాలు మాత్రం సరికొత్తగా తెరపైకొస్తున్నాయి.

ఇక, ఉద్యోగుల జీతాలకు సంబంధించి గతంలో ‘కోత’ విధిస్తూ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. తెలంగాణ ప్రభుత్వమూ ఈ తరహా నిర్ణయమే తీసుకుందనుకోండి.. అది వేరే సంగతి. ఉద్యోగుల జీతాల్లో కోతపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ‘కోత విధించడం సబబు కాదు.. ఉద్యోగులకు రెండు నెలల్లోగా ఆ మొత్తాన్ని చెల్లించాలి.. అదీ వడ్డీతో సహా..’ అని న్యాయస్థానం తీర్పునిచ్చింది.

మామూలుగా అయితే, ఉద్యోగ సంఘాలు న్యాయస్థానం తీర్పుని ఆహ్వానించాల్సి వుంటుంది. చిత్రంగా, ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాలేం.. ఈ సంక్షోభ సమయంలో ప్రభుత్వం నుంచి బకాయిలపై వడ్డీని ఎలా తీసుకోగలం.? మాకూ మానవత్వం వుంది..’ అంటూ ఉద్యోగ సంఘాల తరఫున ఓ లేఖ బయటకు వచ్చింది.

రాజధాని సహా అనేక విషయాల్లో ఉద్యోగ సంఘాల నేతలు, అధికార పార్టీకి తొత్తులుగా మారిపోయారన్న విమర్శలు విన్పిస్తోన్న విషయం విదితమే. ఉద్యోగుల ఆవేదన ఈ ఉద్యోగ సంఘాల నేతలకు పట్టడంలేదు. కింది స్థాయి ఉద్యోగులే కాదు, మధ్య స్థాయి.. ఆ పై స్థాయి ఉద్యోగులు కూడా ‘కరోనా సంక్షోభానికి’ విలవిల్లాడుతున్నమాట వాస్తవం. జీతాలు చెల్లించండి.. వడ్డీతో సహా.. అని కోర్టు చెప్పడంతో వారంతా హర్షం వ్యక్తం చేశారు. కానీ, ఉద్యోగ సంఘాల వాదన మాత్రం వింతగా కన్పిస్తోంది.

ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే, ఉద్యోగ సంఘాల నేతలు ఈ చిత్ర విచిత్రమైన వాదనను తెరపైకి తెచ్చారన్న ఆరోపణలు లేకపోలేదు. మరి, ఈ వ్యవహారంపై ప్రభుత్వం మళ్ళీ కోర్టును ఆశ్రయిస్తుందా.? న్యాయస్థానం ఎలా స్పందిస్తుంది.? వేచి చూడాల్సిందే.

ఇదేమి చిత్రం: జీతాలివ్వమని కోర్టు చెబితే.. అది తప్పంటారేంటీ.! ఇదేమి చిత్రం: జీతాలివ్వమని కోర్టు చెబితే.. అది తప్పంటారేంటీ.!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...