ఆంధ్రప్రదేశ్లో చిత్ర విచిత్రమైన రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్రం, దేశం, ప్రపంచం ఆర్థిక ఇబ్బందుల్లో వున్న మాట వాస్తవం. ఆదాయం వచ్చే మార్గాలు కన్పించక ప్రభుత్వాలు అప్పులు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ కూడా రికార్డు స్థాయిలో అప్పులు చేయాల్సి వస్తోంది. నెలవారీ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికే నానా తంటాలూ పడుతోంది. చిత్రంగా సంక్షేమ పథకాలు మాత్రం సరికొత్తగా తెరపైకొస్తున్నాయి.
ఇక, ఉద్యోగుల జీతాలకు సంబంధించి గతంలో ‘కోత’ విధిస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. తెలంగాణ ప్రభుత్వమూ ఈ తరహా నిర్ణయమే తీసుకుందనుకోండి.. అది వేరే సంగతి. ఉద్యోగుల జీతాల్లో కోతపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ‘కోత విధించడం సబబు కాదు.. ఉద్యోగులకు రెండు నెలల్లోగా ఆ మొత్తాన్ని చెల్లించాలి.. అదీ వడ్డీతో సహా..’ అని న్యాయస్థానం తీర్పునిచ్చింది.
మామూలుగా అయితే, ఉద్యోగ సంఘాలు న్యాయస్థానం తీర్పుని ఆహ్వానించాల్సి వుంటుంది. చిత్రంగా, ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాలేం.. ఈ సంక్షోభ సమయంలో ప్రభుత్వం నుంచి బకాయిలపై వడ్డీని ఎలా తీసుకోగలం.? మాకూ మానవత్వం వుంది..’ అంటూ ఉద్యోగ సంఘాల తరఫున ఓ లేఖ బయటకు వచ్చింది.
రాజధాని సహా అనేక విషయాల్లో ఉద్యోగ సంఘాల నేతలు, అధికార పార్టీకి తొత్తులుగా మారిపోయారన్న విమర్శలు విన్పిస్తోన్న విషయం విదితమే. ఉద్యోగుల ఆవేదన ఈ ఉద్యోగ సంఘాల నేతలకు పట్టడంలేదు. కింది స్థాయి ఉద్యోగులే కాదు, మధ్య స్థాయి.. ఆ పై స్థాయి ఉద్యోగులు కూడా ‘కరోనా సంక్షోభానికి’ విలవిల్లాడుతున్నమాట వాస్తవం. జీతాలు చెల్లించండి.. వడ్డీతో సహా.. అని కోర్టు చెప్పడంతో వారంతా హర్షం వ్యక్తం చేశారు. కానీ, ఉద్యోగ సంఘాల వాదన మాత్రం వింతగా కన్పిస్తోంది.
ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే, ఉద్యోగ సంఘాల నేతలు ఈ చిత్ర విచిత్రమైన వాదనను తెరపైకి తెచ్చారన్న ఆరోపణలు లేకపోలేదు. మరి, ఈ వ్యవహారంపై ప్రభుత్వం మళ్ళీ కోర్టును ఆశ్రయిస్తుందా.? న్యాయస్థానం ఎలా స్పందిస్తుంది.? వేచి చూడాల్సిందే.
934892 892949This internet page is truly a walk-through its the internet you desired with this and didnt know who need to have to. Glimpse here, and youll definitely discover it. 99689