సోషల్ మీడియాని జుగుప్సాకరమైన ప్రచారాలకు వేదికగా మార్చేస్తున్నారు కొందరు. సినీ ప్రముఖులకు సంబంధించిన గాసిప్స్కి సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఆ క్రేజ్ని క్యాష్ చేసుకోవడానికి రకరకాల గాలి వార్తలు పోగేస్తుంటారు కొందరు. గాలి వార్తల స్థాయి దాటి జుగుప్సాకరమైన ప్రచారానికి తెర లేపుతుంటారు ఇంకొందరు. ముఖ్యంగా హీరోయిన్లు ఇలాంటి అసభ్యకరమైన ప్రచారాలకు బలైపోతుంటారు. పోలీస్ రైడింగ్లో పట్టుబడ్డ నటి.. వ్యభిచారం నిర్వహిస్తోన్న ప్రముఖ హీరోయిన్.. పలానా హీరోతో పోలీసులకు చిక్కిన నటి.. ఇలాంటి ఎన్నో రకాలైన అసత్య వార్తలు కనిపిస్తుంటాయి.
సినిమా తారలపై జరిగే దుష్ప్రచారాన్ని మించి రాజకీయ ప్రముఖులపై దుష్ప్రచారాలు పెరిగిపోయాయిప్పుడు. పవన్ కళ్యాణ్కీ, ఓ హీరోయిన్కీ మధ్య సంబంధాలు అంటకడుతూ కొన్ని ఫేక్ వీడియోల్ని ప్రచారంలోకి తెచ్చాయి. ఇదంతా జనసేన మీద బురద చల్లేందుకే. వైఎస్సార్సీపీ మహిళా నేత రోజాకి సంబంధించిన న్యూడ్ వీడియోలంటూ కొందరు చాలాకాలంగా అసత్య వార్తల్ని ప్రచారం చేస్తూనే ఉన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిలకీ, సినీ నటుడు ప్రబాస్కీ అక్రమ సంబంధం అంటకడుతూ జరిగిన దుష్ప్రచారం పెను సంచలనమే అయ్యింది. షర్మిల ఇటీవల పోలిసుల్ని ఆశ్రయించారు. ఆ కేసులో కొందర్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం కూడా చూశాం.
తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత లక్ష్మీ పార్వతి, తనపై జరుగుతున్న అభ్యంతరకర ప్రచారాన్ని నిరసిస్తూ పోలీసుల్ని ఆశ్రయించారు. స్వర్గీయ నందమూరి తారకరామారావు భార్య లక్ష్మీ పార్వతి. ఆమె విషయంలో జరిగిన ప్రచారం అత్యంత హేయం. కొడుకు వయసున్న వ్యక్తి తన తల్లి వయసున్న మహిళ తనను లైంగికంగా, మానసికంగా వేధింపులకు గురి చేస్తోందని ఆరోపించడం దుర్మార్గమే. భర్తను కోల్పోయిన లక్ష్మీ పార్వతి ఇన్నేళ్లలో చాలా అవమానాలు ఎదుర్కొన్నారు. ఓ స్త్రీగా ఆమెకిది అత్యంత బాధాకరమైన విషయం.
కొన్ని న్యూస్ ఛానెల్స్ కూడా విజ్ఞతను కోల్పోయి, లక్ష్మీపార్వతిపై ఆరోపణల వార్తల్ని ఎవరి మెప్పు కోసమో హైలైట్ చేయడం నైతిక విలువల పతనానికి పరాకాష్ట. షర్మిల కేసులో పోలీసులు చాలా వేగంగా స్పందించారు. లక్ష్మీ పార్వతి విషయంలోనూ అలాగే స్పందించాల్సి ఉంది. అయితే ఆరోపణలు చేసిన వ్యక్తి, తన ఆరోపణలకు సాక్ష్యంగా వాట్సాప్ ఛాటింగుల్ని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులకు అతనిచ్చిన ఫిర్యాదుపై విచారణ ఏ స్థాయిలో ఉందన్న దానికి సంబంధించి పూర్తి సమాచారం లేదు. అసలు ఆ కేసుని సీరియస్గా టేకప్ చేశారా.? లేక కేవలం లక్ష్మీ పార్వతిపై రాజకీయ అక్కసు తీర్చుకునేందుకే అంతలా ఆ విషయాన్ని పని గట్టుకుని తెర వెనక పెద్దలెవరో హైలైట్ చేశారా.? అనేది తేలాల్సిందే.
టీడీపీ మహిళా నేత అనిత, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుగారి కోడలు నారా బ్రాహ్మణి.. ఇలా సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలకు ఎవరూ అతీతం కాదన్నట్లుంది పరిస్థితి. గతంలో తెలంగాణాకు చెందిన ఓ మహిళా ఐఏఎస్ అధికారి పైన జుగుప్సాకరమైన రాతలు కూడా అప్పట్లో దుమారం రేపిన సంగతి తెలిసిందే.
536197 993677I genuinely adore the theme on your website, I run a internet internet site , and i would adore to use this theme. Is it a no cost style, or is it custom? 625044
441924 737478you could have a fantastic weblog here! would you wish to make some invite posts on my weblog? 957237