భారతీయ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు( KCR) అస్వస్థతకు గురయ్యారు. గురువారం రాత్రి ఆయన కాలు జారిపడి గాయం అవ్వడంతో హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆయన తుంటి కాలు ఎముక విరిగినట్లు వైద్యులు గుర్తించారు. ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని భావిస్తున్నారు.
దీనికి సంబంధించి అన్ని వైద్య పరీక్షలు పూర్తయ్యాక నిర్ణయం తీసుకుంటామని వైద్యులు ప్రకటించారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.