Switch to English

వైసీపీ చెప్పినట్టే ఈసీ చేస్తోంది: చంద్రబాబు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

ఏపీలో పోలింగ్ కు ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల సంఘంపై సమరశంఖం పూరించారు. తెలుగుదేశం పార్టీ లక్ష్యంగా ఈసీ నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ చెప్పినట్టుగా ఈసీ వ్యవహరిస్తోందని విమర్శించారు. బుధవారం మధ్యాహ్నం ఆయన సచివాలయానికి వచ్చి రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ గోపాలకృష్ణ ద్వివేదీని కలిశారు. ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ ఆయనకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ద్వివేదికి వినతి పత్రం అందజేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని అందులో పేర్కొన్నారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, ఎన్నికల సంఘం, వైఎస్సార్ సీపీపై ఆరోపణలు చేశారు. ఇష్టానుసారంగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే రాష్ట్రంలో నలుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారని, తాజాగా ప్రకాశం జిల్లా ఎస్పీని బదిలీ చేశారని మండిపడ్డారు. ఈ బదిలీల వెనుక కుట్రకోణం ఉందని ఆరోపించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా చేయాలని ప్రధాని ఆదేశించారని, దీంతో ఈసీ అలాగే చేస్తోందని ఆరోపణలు చేశారు.

వైఎస్సార్ సీపీ ఫిర్యాదులపై ఎలాంటి విచారణ జరపకుండానే బదిలీలు ఎలా జరుపుతారని ప్రశ్నించారు. ఈసీ వ్యవహారం రాజ్యాంగ విరుద్ధంగా ఉందని ఆరోపించారు. ఇలాంటి చర్యల ద్వారా ఈసీ చులకన కాకూడదన్నారు. ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుంటే చూస్తూ కూర్చోలేమని వ్యాఖ్యానించారు. తాము ఫిర్యాదు చేస్తే కనీస స్పందన లేదని, కానీ వైఎస్సార్ సీపీ ఫిర్యాదు చేస్తే గంటల్లోనే పనులు జరుగిపోతున్నాయని దుయ్యబట్టారు. ఆళ్లగడ్డలో నోట్టు విసురుతున్నారని టీడీపీ ఫిర్యాదు చేస్తే ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని పేర్కొంటూ 65 మంది రిటైర్డ్ అధికారులు రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

మీడియాతో మాట్లాడిన అనంతరం చంద్రబాబు సచివాలయంలోని ఐదో బ్లాక్ ఎదుట ధర్నా చేశారు. ఐదు నిమిషాలపాటు అక్కడే ఆందోళన నిర్వహించిన తర్వాత వెళ్లిపోయారు. అయితే, చంద్రబాబు చర్యను వైఎస్సార్ సీపీ ఖండించింది. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య సృష్టించి ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడాలనే యోచనలో చంద్రబాబు ఉన్నారని ఆరోపించింది. ఈ మేరకు ఆ పార్టీ నేత నాగిరెడ్డి ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిసి ఫిర్యాదు చేశారు. చివరి నిమిషంలో చంద్రబాబు కుట్రలకు తెరలేపుతున్నారని, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...