ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ప్రచారానికి మంగళవారం సాయంత్రమే పుల్ స్టాప్ పడింది. దాదాపు మూడు వారాలుగా హోరెత్తిన మైకులు మూగబోయాయి. ఇక ఓటరు తన తీర్పును ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నిక్షిప్తం చేయడమే మిగిలి ఉంది. ఈ మూడు వారాల్లో జరిగిన ప్రచారం గతంలో ఎన్నడూ లేనంత ఉదృతంగా సాగింది. మొదటి విడతలోనే రాష్ట్రంలో ఎన్నికలు ఉండటం.. అందుకు సన్నద్ధం కావడానికి సరిగా సమయం లేకపోవడం వంటి కారణాలతో నేతలు సుడిగాలిలా రాష్ట్రాన్ని చుట్టేశారు. ఎక్కడికక్కడ రోడ్ షోలతో జనంతో మమేకమయ్యారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచారంలో దూసుకెళ్లారు. ఆయనకు మద్దతుగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా, మాజీ ప్రధాని దేవెగౌడ ప్రచారం చేశారు. ఇక వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సుడిగాలి ప్రచారంతో రాష్ట్రాన్ని చుట్టేశారు. పాదయాత్ర ద్వారా ఇప్పటికే రాష్ట్రంలోని చాలా ప్రాంతాలను కవర్ చేసిన ఆయన.. తాజాగా ఎక్కడికక్కడ రోడ్ షోలతో హోరెత్తించారు. ఆయనకు తల్లి వైఎస్ విజయమ్మ, సోదరి షర్మిల తోడ్పాటుగా నిలిచారు. జనసేన అధినేత పవన్ కూడా ప్రచారంలో కదం తొక్కారు. రాష్ట్రం మొత్తం కాకపోయినా, తాము లక్ష్యంగా పెట్టుకున్న ప్రాంతాల్లో ప్రచారం చేశారు.
అయితే, ఈసారి ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు కాస్త దూకుడుగా వెళ్లారు. ప్రతి సభలోనూ వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోపాటు తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భాల్లో కొన్నిసార్లు పరుష వ్యాఖ్యలు కూడా చేశారు. మోదీ, కేసీఆర్ లకు జగన్ ఊడిగం చేస్తున్నారని పలుమార్లు ఆరోపణలు చేశారు. ఎంతో సీనియర్ రాజకీయ నాయకుడినైన తాను ఓ నేరస్తుడితో పోటీ పడాల్సి వస్తోందని పేర్కొన్నారు. మోదీ మనల్ని మోసం చేశారని దుయ్యబట్టారు. ఇక చివరి రోజు సభలో అయితే మరింత ఉధృతి పెంచారు. మోదీకి జగన్, కేసీఆర్ లు పెంపుడు కుక్కలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కు ఓటేస్తే కేసీఆర్ కు ఓటేసినట్టేనని.. ఆత్మగౌరవం చంపుకునే ఇలాంటి పనులు చేయొద్దంటూ సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.
ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ జగన్ లక్ష్యంగానే విమర్శలు చేశారు. అడపాదడపా టీడీపీ నేతలను టార్గెట్ చేశారు. కానీ ఎక్కడా చంద్రబాబును నేరుగా ఆయన విమర్శించలేదు. ఇది ఒకవిధంగా పవన్ కు నష్టం చేకూర్చే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. టీడీపీ అధినేత చంద్రబాబే లక్ష్యంగా విమర్శలు ఎక్కుపెట్టారు. వ్యక్తిగతంగా ఎక్కడా విమర్శలు చేయకపోయినా, ఆయన గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేదనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో మళ్లీ జనాన్ని మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. మొత్తమ్మీద త్రిముఖ పోరు నెలకొన్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు రంగం సిద్ధమైంది. ఎవరికి ఓటేయాలో ఓటరు ఇప్పటికే ఓ నిర్ణయానికి కూడా వచ్చాడు. ఇక ఈవీఎం మీట నొక్కడమే తరువాయి.
435286 718090A thoughtful opinion and tips Ill use on my web page. Youve certainly spent some time on this. Well carried out! 251039
328314 245126if the buffalo in my head could speak german i would not know a god damm thing. What i do know is that the language of art is out of this world. 977719