భూ కబ్జా ఆరోపణలపై మంత్రి పదవి కోల్పోయి అధికార పార్టీకి టార్గెట్ గా మారిన ఈటల రాజేందర్ వ్యవహారంలో మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఈటల కుమారుడిపైనా సీఎం కేసీఆర్ కు ఫిర్యాదు అందింది. ఈటల కుమారుడు నితిన్ రెడ్డి తన భూమిని కబ్జా చేశారంటూ మేడ్చల్ మండలం రావల్ కోల్ వాసి మహేశ్ ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలని సీఎంను కోరారు. దీనిపై సీఎం వెంటనే స్పందించారు. తక్షణమే ఈ వ్యవహారంపై విచారణ చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్, ఏసీబీ విజిలెన్స్ ను ఆదేశించారు. సమగ్ర నివేదిక జరిపి నివేదిక ఇవ్వాలని సూచించారు. ఇప్పటికే భూకబ్జా ఆరోపణలతో సతమతమవుతున్న ఈటలకు ఇది మరో షాక్ గా మారింది.
ఇప్పటికే మెదక్ జిల్లా అచ్చంపేట, హకీంపేటల్లో అసైన్డ్ భూములను ఆక్రమించుకున్నారనే ఆరోపణలపై సీఎం కేసీఆర్ ఆయన్ను మంత్రివర్గం నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. ఓవైపు కేసులు, విచారణలతో ఇబ్బందులు పడుతున్న ఈటలను రాజకీయంగా కూడా దెబ్బతీసే వ్యూహంతో అధికార పార్టీ సాగుతోంది. ఈటల నియోజకవర్గంలో టీఆర్ఎస్ క్యాడర్ ఈటల వైపు వెళ్లకుండా చూసే బాధ్యతను మంత్రి హరీశ్ రావుకు అప్పగించారు. దీంతో ఆయన ఇప్పటికే రంగంలోకి దిగిపోయి చర్యలు ప్రారంభించారు. ఇదే సమయంతో తన కుమారుడిపైనా భూకబ్జా ఆరోపణలు రావడంతో ఈటల ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
101363 891360Thanks for the sensible critique. Me and my neighbor were just preparing to do some research about this. We got a grab a book from our area library but I believe I learned much more from this post. Im extremely glad to see such amazing information being shared freely out there. 818642
261952 87586Wohh exactly what I was searching for, regards for posting . 276638
167583 494601Spot lets start work on this write-up, I truly believe this fabulous website needs a fantastic deal much more consideration. Ill apt to be once again to learn far more, appreciate your that info. 793011
23587 695775Thank you for sharing with us, I believe this website genuinely stands out : D. 978834