బిడ్డ కోసం ఇద్దరు కొట్టుకోవడం చూశాం.. పోలీసు కేసుల వరకు వెళ్లడమూ చూశాం.. కానీ ఇక్కడ ఓ కుక్క కోసం ఇద్దరు వ్యక్తులు ఘర్షణ పడుతున్నారు. అది నాదంటే నాదంటూ వాదులాడుకుంటున్నారు. ఆ శునకం ఎవరిదో తేల్చడం పోలీసుల వల్ల కూడా కాలేదు. దీంతో ఇక డీఎన్ఏ పరీక్ష ద్వారా ఈ కేసును కొలిక్కి తేవాలని నిర్ణయానికి వచ్చారు.
మధ్యప్రదేశ్ లోని హోసంగాబాద్ లో ఈ అరుదైన ఘటన చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన సాహేబ్ ఖాన్ అనే వ్యక్తి.. తమ పెంపుడు కుక్క కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో ఏబీవీపీకి చెందిన కార్తీక్ అనే వ్యక్తి కూడా తమ పెంపుడు శునకం కనిపించడంలేదని పోలీసులను ఆశ్రయించారు. రెండు ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు శునకం కోసం గాలించగా ఒకదాని ఆచూకీ లభించింది. అయితే, అది ఎవరిది అనే విషయం తేల్చడానికి ఇద్దరినీ పిలిపించారు. ఆశ్చర్యకరంగా ఇద్దరూ అది తమ కుక్కే అని వాదించారు.
మూడునెలల క్రితం తాను ఆ కుక్కను కొనుగోలు చేశానని.. దానిపేరు కోకో అని సాహెబ్ ఖాన్ చెప్పారు. ఆ కుక్క తల్లి వివరాలు కూడా తెలిపారు. ఇక కార్తీక్ సైతం అది తమ కుక్కేనని పేర్కొన్నారు. నాలుగు నెలల క్రితం దానిని కొన్నానని, దాని పేరు టైగర్ అని వివరించారు. దీంతో ఏ పేరుతో పిలిస్తే అది పలుకుతుందో చూద్దామని భావించిన పోలీసులకు అక్కడా నిరాశే ఎదురైంది. ఎందుకంటే కోకో అని పిలిచినా.. టైగర్ అని కేకేసినా అది స్పందిస్తోంది.
ఇక ఈ కేసును పరిష్కరించడానికి డీఎన్ఏ పరీక్ష ఒక్కటే మార్గమని పోలీసులకు నిర్ణయానికి వచ్చారు. ఈ శునకానికి డీఎన్ఏ పరీక్ష చేయించడం ద్వారా దాని తల్లిని గుర్తించి.. ఆపై అసలు యజమానికి అప్పగించాలని భావిస్తున్నారు. మొత్తానికి బిడ్డ తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవడానికి చేసే డీఎన్ఏ పరీక్షను శునకానికి చేయాలని నిర్ణయించడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఉదంతంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇంతకీ ఈ కుక్క ఎవరికి దక్కుతుందో తెలియాలంటే డీఎన్ఏ పరీక్ష ఫలితాలు వచ్చేవరకు వేచి చూడక తప్పదు.
569366 770669Sweet internet site , super pattern , very clean and utilize friendly . 493677
30152 284639An intriguing discussion will likely be worth comment. Im sure which you need to write a lot more about this subject, it might not be a taboo topic but normally consumers are too couple of to chat on such topics. To another. Cheers 858826