ప్రముఖ దర్శకుడు సతీశ్ వేగేశ్న తన కుమారుడిని హీరోగా పరిచయం చేస్తారని గతంలో వార్తలు వచ్చాయి. ఆ సినిమాలో మరో హీరో కూడా నటించబోతున్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ వార్తల్ని నిజం చేస్తూ విజయదశమి శుభ ముహూర్తాన సతీశ్ వేగేశ్న తన కొత్త సినిమా ప్రారంభించారు.
ఈ సినిమా ద్వారా తన కుమారుడు సమీర్ వేగేశ్నను పరిచయం చేసే బాధ్యతను తీసుకున్నారు. ఈ సినిమాలో మరో హీరోగా ప్రముఖ నటుడు, దివంగత శ్రీహరి తనయుడు మేఘాంశ్ నటిస్తున్నాడు. ఈ సినిమా ఈ రోజు లాంఛనంగా ప్రారంభమైంది.
సినిమా ముహూర్త కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, హీరో అల్లరి నరేశ్ పాల్గొన్నారు. దిల్ రాజు దేవుడి పటాలపై క్లాప్ ఇచ్చారు. అల్లరి నరేశ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. సినిమాకు టైటిల్ గా ‘కోతి కొమ్మచ్చి’ అని నిర్ణయించారు.
సినిమాకు సంగీతం అనూప్ రుబెన్స్ అందిస్తున్నారు. హీరోయిన్లుగా రిద్ది కుమార్, తమిళ అర్జున్ రెడ్డిలో నటించిన మేఘా చౌదరిని ఎంపిక చేసారని తెలుస్తోంది. లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎమ్ఎల్ వీ సత్యనారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
645707 369625A thoughtful opinion and suggestions Ill use on my internet page. Youve clearly spent some time on this. Well carried out! 435804