టీం ఇండియా మాజీ క్రికెటర్ అయిన మహేంద్ర సింగ్ ధోని సొంత రాష్ట్రం ఝార్ఖండ్. ఆ రాష్ట్రం నుండి టీం ఇండియాకు మొదట ప్రాతినిధ్యం వహించిన క్రికెటర్ ధోనీ అవ్వడం వల్ల ఆయనకు ఆ రాష్ట్ర క్రికెట్ సంఘంలో శాస్వత సభ్వత్వంను ఇస్తున్నట్లుగా గత ఏడాది ప్రకటన వచ్చింది. అందుకోసం ధోనీ 1800 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
కాని నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు ధోనీ ఆ మొత్తంను చెల్లించక పోవడంతో రాష్ట్ర క్రికెట్ సంఘం నోటీసులు ఇవ్వడం జరిగింది. మరికొన్ని రోజుల్లో రుసుము చెల్లించకుంటే సభ్యత్వం తొలగించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది.
మీడియాలో విషయాన్ని తెలుసుకున్న ధోనీ అభిమానులు కొందరు కూడి ఆమొత్తంను వసూళ్లు చేశారు. విధ్యార్థులు మరియు కొందరి నుండి చందాలు వసూళ్లు చేసి చెల్లించేందుకు సిద్దం అయ్యారు. అయితే ధోనీ తరపున అభిమానులు చెల్లించే ఆ మొత్తంను స్వీకరించేందుకు జేఎస్సీఏ నిరాకరించింది. సభ్యుడి అంగీకార పత్రంతో ఆ మొత్తంను తీసుకు వస్తే తీసుకుంటామని, ధోనీతో సంబంధం లేకుండా ఆ డబ్బును తీసుకు రావడం వల్ల మేము వాటిని అంగీకరించడం లేదు అంటూ జేఎస్సీఏ ప్రెసిడెంట్ పేర్కొన్నారు.
ధోనీ నుండి సభ్యత్వ రుసుము వస్తుందని వెయిట్ చేస్తున్నామని త్వరలో ఆయన్ను సంప్రదించేందుకు ప్రయత్నిస్తామంటూ పేర్కొన్నారు. చందాలు వేసుకున్న అభిమానులు మాత్రం ఆ డబ్బు సభ్యత్వ ఫీజుగా తీసుకోవాల్సిందే అంటూ పట్టుబడుతున్నారు. చివరకు ఏం జరుగుతుందో చూడాలి.
597595 752994Enjoyed looking at this, quite very good stuff, thanks . 651826
538038 795209I conceive this internet site contains some rattling superb info for every person : D. 451033