మహేంద్ర సింగ్ ధోనీ క్రికెటర్ గా ఎంతగా సక్సెస్ అయ్యాడో వ్యాపారిగా కూడా అంతే సక్సెస్ అవుతున్నాడు. ఆయన ఎన్నో సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. అందులో పలు సంస్థలకు సహ ఓనర్ గా కూడా ధోని వ్యవహరించడం విశేషం. ఇప్పుడు ధోని చాక్లెట్ లను అందించేందుకు సిద్దం అయ్యాడు. ధోనీ పేరు చెప్పగానే హెలికాప్టర్ షాట్ గుర్తుకు వస్తుంది. అందుకే హెలికాప్టర్ షాట్ పేరుతో ఒక చాక్లెట్ ను విడుదల చేశాడు. ఇంకా ధోనీ జెర్సీ నెం.7 కనుక కాప్టర్ 7 అనే చాక్లెట్ ను కూడా విడుదల చేయడం జరిగింది.
ముంబయికి చెందిన 7 ఇంక్ బ్రూస్ అనే స్టార్టప్ ఫుడ్ మేకింగ్ సంస్థ ఈ చాక్లెట్స్ ను విడుదల చేయడం జరిగింది. మోహిత్ మరియు అదిల్ మిస్త్రీ, కునాల్ లతో కలిసి ధోనీ ఈ చాక్లెట్ కంపెనీ ప్రారంభించారు. ఈ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా స్వయంగా ధోని వ్యవహరించబోతున్నాడు. అంబాసిడర్ గా వ్యవహరించినందుకు గాను ధోనికి ఈ కంపెనీలో మెజార్టీ వాట దక్కిందని చెబుతున్నారు. మొత్తానికి క్రికెట్ నుండి దూరం అయినా కూడా ధోని ఇంకా తన బ్రాండ్ వ్యాల్యూ మాత్రం కొనసాగిస్తూనే ఉన్నాడు అంటూ అభిమానులు అంటున్నారు.
121606 102893very good post, i certainly enjoy this remarkable site, persist in it 960278