వాహన మిత్ర పథకంలో భాగంగా ఆటో డ్రైవర్లకు ఏపీ ప్రభుత్వం పది వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వాహన మిత్ర నిధులు విడుదల చేశారు. ఈ క్రమంలో మంత్రులు ఆయా జిల్లాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. లబ్దిదారుల్ని పిలిపించుకున్నారు.
అసలంటూ లబ్ది దారులకు సంక్షేమ పథకాలు అందించే కార్యక్రమాలకు ఎందుకీ అనవసరపు పబ్లిసిటీ.? అన్న చర్చ ఓ వైపు జరుగుతోంది. కానీ, అధికారంలో వున్నోళ్ళు ఆ మాత్రం పబ్లిసిటీ చేసుకోకపోతే ఎలా.? గతంలో చంద్రబాబు సర్కారు అదే చేసింది, ఇప్పుడు వైఎస్ జగన్ సర్కారు కూడా అదే చేస్తోంది.
ఆయా సంక్షేమ పథకాల పేరుతో లబ్దిదారులకు కలుగుతున్న లబ్ది ఎంత.? అన్న విషయాన్ని పక్కన పెడితే, పత్రికల్లో ప్రకటనలు సహా, పబ్లిసిటీ ఖర్చు మాత్రం తడిసి మోపెడవుతోందన్న విమర్శలు లేకపోలేదు. ఇంతా చేస్తే, లబ్దిదారులేమో లైట్ తీసుకుంటున్నారు.
‘ఎవరున్నారని నేను ధీమాగా వున్నాను..’ అని ముఖ్యమంత్రి అన్నారట.. దానికి లబ్దిదారులు ‘మేమున్నాం..’ అని గట్టిగా నినదించాలట. అలాగని మంత్రి ధర్మాన సెలవిచ్చారు. ‘మీరేమిరా ఊరుకుంటున్నరు..’ అంటూ మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలతో లబ్దిదారులు అవాక్కయ్యారు.
‘మాకు ఓటెయ్యకపోతే సంక్షేమ పథకాలు ఆపేస్తాం..’ అని మంత్రులే స్థానిక ఎన్నికల సమయంలో జనాన్ని బ్లాక్మెయిల్ చేసిన వైనాన్ని చూశాం. ఇప్పుడేమో, సంక్షేమ పథకాల లబ్దిదారుల్ని.. ఇలా బాహాటంగా బెదిరిస్తున్న వైనం కూడా కనిపిస్తోంది.
ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో ‘సాయం’ చేసేస్తున్నామని చెప్పుకుంటోంది. కానీ, అది అప్పు చేసి పప్పుకూడు అన్న చందం జనానికి అర్థమవుతోంది. ఆ పేరుతో అధికార పక్షం పబ్లిసిటీ స్టంట్లు చేస్తోందని జనం భావిస్తున్నారు. అందుకేనేమో, సాక్షాత్తూ ముఖ్యమంత్రి అడుగుతున్నాగానీ, లబ్దిదారులు పట్టించుకోవడంలేదన్నమాట.
407292 512488 An intriguing discussion is worth comment. I feel which you should write more on this subject, it might not be a taboo topic but normally men and women are not enough to speak on such topics. To the next. Cheers 873222
664364 651537I gotta bookmark this website it seems quite beneficial . 251997