వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి గురించి పెద్దగా పరిచయం అవసరంలేదు. పిల్లల అక్రమ నిర్బంధం నుంచి మహిళల అక్రమ రవాణా వరకు పలు ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఈ నేపథ్యంలో గతేడాది దేశం విడిచి పరారైన నిత్యానందుడు.. ఈక్వెడార్ లోని ఓ ద్వీపాన్ని కొనుగోలు చేసి, దానికి కైలాస అని నామకరణం చేసి, అది తన సొంత దేశమని ప్రకటించుకున్నాడు. అన్ని దేశాల మాదిరిగానే తమ దేశంలోనూ పౌరసత్వం ఉందని.. ప్రపంచంలోనే గొప్ప హిందూ దేశమైన కైలాసకు రావాలంటే పాస్ పోర్టు, వీసా కూడా తప్పనిసరి అని స్పష్టంచేశాడు. ఇలా నిత్యానందుడి గురించి పలు కామెడీ విషయాలు అప్పడప్పుడూ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. తా
జాగా మరో ఆసక్తికరమైన విషయాన్ని ఆయన ప్రకటించాడు. కైలాస దేశానికి ప్రత్యేక కరెన్సీ తీసుకురాబోతున్నామని, ఈ వినాయక చవితి నుంచి రిజర్వ్ బ్యాంకు ఆఫ్ కైలాస (ఆర్బీకే) ప్రారంభం కాబోతోందని తెలిపాడు. ఆ రోజు నుంచి తమ ప్రత్యేక కరెన్సీ చలామణిలోకి వస్తుందని వివరించాడు. తమ కరెన్సీ ఏ దేశంలోనైనా చెల్లుబాటు అవుతుందని, అలాగే ఏ దేశ కరెన్సీ అయినా తమ దేశంలో చెల్లుబాటు అవుతుందని కూడా వెల్లడించాడు. దీనికి సంబంధించి చట్టబద్ధంగా ఒప్పందాలు కూడా కుదర్చుకున్నామని పేర్కొన్నాడు.
కరెన్సీ రూపురేఖలు, ఆర్థిక విధానం వివరాలను వినాయక చవితి సందర్భంగా ఈనెల 22న వివరిస్తామని నిత్యానంద ఓ ప్రకటనలో తెలిపాడు. నిత్యానంద ఈ ప్రకటన చేశాడో లేదో.. వెంటనే సోషల్ మీడియాలో ఆయన ఫొటోతో కూడిన కరెన్సీ నోట్లు ప్రత్యక్షమయ్యాయి. భారత్ లో అనేక కేసుల్లో ఇరుక్కుని దేశం విడిచి పారిపోయిన ఈ వివాదాస్పద ఆధ్యాత్మిక మత గురువు.. ప్రత్యేక దేశం, ప్రత్యేక పాస్ పోర్టు, ప్రత్యే ప్రభుత్వం అంటూ చెప్పడంతోపాటు తాజాగా ప్రత్యేక కరెన్సీ అంటున్నాడని, ముందుముందు ఇంకా ఎన్ని లీలలు చూడాల్సి వస్తుందో అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
415546 184012I discovered your weblog web site on google and verify a few of your early posts. Continue to sustain up the superb operate. I basically extra up your RSS feed to my MSN News Reader. Looking for forward to reading extra from you in a while! 628669