తెలంగాణలో ప్రస్తుతం కోవిడ్ పాజిటివిటీ 0.18గా ఉందని.. భవిష్యత్తులో రాష్ట్రంలో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవచ్చని రాష్ట్ర హెల్త్ డైరక్టర్ శ్రీనివాసరావు అన్నారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
‘రాష్ట్రంలో దాదాపుగా మహమ్మారి అదుపులోకి వచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 40 కొత్త కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కోవిడ్ ఆంక్షలు లేవు. ఆసుపత్రులకు వెళ్లేవారు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు మాస్కులు ధరించాలి. సాధారణ వ్యక్తులు మామూలు సమయాల్లో మాస్కులు ధరించాలా.. వద్దా.. అనేది వారి ఇష్టం. అయితే.. కోవిడ్ ముప్పు పూర్తిగా తొలగిపోలేదు కాబట్టి.. జనసమూహాల్లో మాస్కులు ధరించడం అవసరం. లేదంటే రూ.1000 జరిమానా ఉంటుంది’.
‘చైనా, ఆస్ట్రేలియా దేశాల్లో వెలుగుచూసిన వేరియంట్లతో ఆందోళన అవసరం లేదు. ఎండల తీవ్రత దృష్ట్యా 12-4 గంటల మధ్య అవసరమైతే తప్ప బయటకు రావొద్దు. వడదెబ్బ తగిలితే వెంటనే నీడలోకి వెళ్లి గాలి తగిలేలా చూడాలి. తగ్గకపోతే ఆసుపత్రికి వెళ్లాలి. ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించాం’ అని అన్నారు.
730472 532181i just didnt need a kindle at 1st, but when receiving 1 for christmas im utterly converted. It supply genuine advantages more than a book, and makes it such a good deal additional convenient. i may well undoubtedly advocate this item: 415718