దేశంలో కరోనా వైరస్ తీవ్రత హెచ్చుతగ్గులతో కొనసాగుతోంది. ముందురోజు కంటే కొత్త కేసులు, మరణాలు కొద్దిగా తగ్గాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 4.8లక్షల మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 1033 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే కోవిడ్ తో 43 మంది మృతి చెందారు. ఈమేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రస్తుత గణాంకాలు విడుదల చేసింది. మొత్తంగా కరోనాతో ఇప్పటివరకూ 5.21లక్షల మంది మృతి చెందారు.
మొత్తంగా కరోనా రికవరీ రేటు 98.76 శాతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 11,632 గా నమోదయ్యాయి. మొత్తంగా ఇప్పటివరకూ దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 4.03కోట్లుగా నమోదైంది. కోవిడ్ నుంచి 4.24 కోట్ల మంది కోలుకున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్విరామంగా కొనసాగుతోంది. నిన్న 15లక్షల మంది వ్యాక్సిన్ వేయించుకోగా.. మొత్తంగా 185కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ అయ్యాయి. మరోవైపు ముంబైలో XE వేరియంట్ కేసు నమోదవడం కలకలం రేపుతోంది. అయితే.. దీనిపై అప్పుడే నిర్ధారణకు రాలేమని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.
947039 464347Whoa! This blog looks just like my old 1! It is on a totally different subject but it has pretty a lot the same layout and design. Outstanding choice of colors! 188762
267351 725198Fairly uncommon. Is likely to appreciate it for individuals who consist of community forums or anything, internet site theme . a tones way for the client to communicate. Outstanding job.. 47221