Switch to English

ఇదేమి చోద్యం: కరోనా కేసులు తగ్గాలంటే.. టెస్టులు తగ్గించాల్సిందేనా.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,432FansLike
57,764FollowersFollow

దేశంలో కరోనా కేసుల్ని తగ్గించాలంటే ఏం చేయాలి.? ప్రస్తుత పరిస్థితుల్లో కరోనాని తగ్గించడం కష్టసాధ్యంగానే కన్పిస్తోంది గనుక.. టెస్టులు తగ్గించేస్తే సరి.! ఔను, గత రెండు మూడు రోజులుగా దేశంలోని చాలా రాష్ట్రాల్లో భిన్నమైన పరిస్థితులు కన్పిస్తున్నాయి.. కరోనా టెస్టులకు సంబంధించి. తెలంగాణలో అయితే, కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య వెయ్యి లోపే పడిపోయింది నిన్న. ఈ రోజు, ఎలాగోలా వెయ్యి దాటిందనుకోండి.. అది వేరే సంగతి.

కొన్ని రోజుల క్రితం రోజుకి పది వేలు కేసులు నమోదు చేసిన ఆంధ్రప్రదేశ్‌లోనూ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. మహారాష్ట్రదీ ఇదే పరిస్థితి. కారణం ఒక్కటే.. అన్ని చోట్లా టెస్టులు తగ్గుతున్నాయి. వరుస సెలవుల నేపథ్యంలోనే టెస్టులు తగ్గుతున్నాయన్నది ఓ వాదన. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో టెస్టుల్ని గణనీయంగా పెంచాల్సింది పోయి.. ‘కుంటి సాకులు’ చూపుతూ, టెస్టుల్ని తగ్గించడమేంటి.?

నిజానికి, ఆంధ్రప్రదేశ్‌లో క్రమంగా టెస్టులు జరుగుతున్న తీరు చూశాక, ఒక్క రోజులో లక్ష టెస్టుల దిశగా దూసుకుపోతోందని అంతా అనుకున్నారు. అనూహ్యంగా అది50 వేల కిందికి పడిపోయింది నిన్న. తెలంగాణలోనూ కరోనా టెస్టుల పరిస్థితి ఇంకా అధ్వాన్నం. ఇక, టెస్టులు చేయడం ఓ ఎత్తు.. వాటి ఫలితాల్ని విడుదల చేయడం ఇంకో ఎత్తు.

మొబైల్‌ టెస్టింగ్‌ యూనిట్స్‌ ద్వారా కరోనా పరీక్షలు చేస్తున్నా.. వాటి ఫలితాల వెల్లడి విషయంలో తీవ్ర గందరగోళం నెలకొంటోంది. కొన్నిసార్లు టెస్టుల కోసం శాంపిల్స్‌ ఇచ్చిన ఐదారు రోజుల తర్వాత గానీ ఫలితాలు రావడంలేదు. ఈ లోగా జరగకూడని అనర్థాలే జరిగిపోతున్నాయి. ‘మేం అత్యద్భుతంగా టెస్టులు చేసేస్తున్నాం..’ అని రికార్డుల గురించి మాట్లాడుతోన్న ఆంధ్రప్రదేశ్‌లో టెస్టుల ఫలితాల ఆలస్యంపై చాలా ఫిర్యాదులు సోషల్‌ మీడియా వేదికగా బాధిత ప్రజానీకం నుంచి వెల్లువెత్తుతుండడం గమనార్హం.

రాష్ట్రాల్లో పరిస్థితులు ఇలా వుంటే.. అవే పరిస్థితులు దేశవ్యాప్తంగానూ ప్రతిబింబిస్తాయి కదా.! ఓ దశలో 57 వేలకు పైబడి చేరుకున్న రోజువారీ కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య.. ఇప్పుడు నిన్న 52 వేలకు పరిమితమయ్యింది. అయినా, వరుసగా రెండో రోజు ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కేసులు (రోజువారీ లెక్కలు) నమోదైన దేశంగా భారతదేశం సరికొత్త రికార్డు సృష్టించింది. 130 కోట్ల మంది జనాభా వున్న భారతదేశంలో.. రోజుకి కోటి టెస్టులు జరిగినా తక్కువేనేమో.. కానీ, ఎన్ని టెస్టులు జరుగుతున్నాయ్‌.! ఇలాగైతే, దేశంలో కరోనాని నియంత్రించేది ఎలా.?

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

ఎక్కువ చదివినవి

శింగనమలలో గెలుపు దిశగా శైలజానాథ్.. ఆ పార్టీల ఆశలు గల్లంతు.!

పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ఏపీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీల హోరాహోరీ ప్రచారంతో ఈసారి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకునేది ఎవరా.. అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఒంటరిగా వైసీపీ-...

‘భజే వాయువేగం’ నుంచి ‘సెట్ అయ్యిందే’ సాంగ్ విడుదల

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ( Karthikeya ) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'భజే వాయువేగం'. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను మూవీ టీం రిలీజ్ చేసింది. 'సెట్ అయ్యిందే'...

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...