Switch to English

కరోనా అలర్ట్‌: ఆంధ్రప్రదేశ్‌ ‘లెక్క’ తప్పుతోందా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

కరోనా వైరస్‌ తీవ్రతను ముందస్తుగా అంచనా వేయడంలో మొదటి నుంచీ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తప్పటడుగులు వేస్తోంది. ‘జ్వరం వస్తే వాడే పారాసిటమాల్‌ మందులు సరిపోతాయ్‌.. బ్లీచింగ్‌ పౌడర్‌ వేస్తే వైరస్‌ చనిపోతుంది..’ అంటూ సాక్షాత్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చెప్పాక, కరోనా వైరస్‌ విషయంలో ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరిస్తోందని ఎవరైనా ఎలా అనుకోగలం.?

ఒకసారి కాదు, ఒకటికి పదిసార్లు అధికార పార్టీ నేతలు ఇవే వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఇప్పుడేమో కరోనా వైరస్‌ మీద వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఏకంగా ‘యుద్ధం’ చేసేస్తోందంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు వైసీపీ నేతలు. తెలంగాణ సహా దేశంలో ఇతర రాష్ట్రాల ఆలోచనలు ఇందుకు భిన్నంగా వున్నాయి. కరోనా వైరస్‌ని ‘మహమ్మారి’గా ముందే అనుమానించాయి. ‘పారాసిటమాల్‌’ వ్యాఖ్యల్ని తొలుత కేసీఆర్‌ కూడా చేసినా, వెంటనే ఆయన తన వ్యాఖ్యల్ని సవరించుకున్నారు. లాక్‌డౌన్‌ని అమలు చేయడం సహా అనేక విషయాల్లో కేంద్రం కంటే ముందుగా చర్యలు తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం.

లాక్‌డౌన్‌ తప్ప ఇంకో ప్రత్యామ్నాయం లేదని తెలిసినా, ‘రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌’ జోన్లు అనీ, ఇంకోటనీ.. చిత్ర విచిత్రమైన పబ్లిసిటీ స్టంట్లు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చేస్తుండడం గమనార్హం. ‘ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ తీవ్రత ఎక్కువగా లేదు.. కొన్ని ప్రాంతాలకే అది పరిమితం..’ అని ప్రమాదాన్ని తక్కువ చేసి చూపే ప్రయత్నం జగన్‌ ప్రభుత్వం చేసిందన్నది నిర్వివాదాంశం.

ఈ క్రమంలో అధికార పార్టీ నేతలు నానా రకాల పబ్లిసిటీ స్టంట్లూ చేసేశారు. ఫలితంగా, రాష్ట్రంలో కరోనా వైరస్‌ విస్తరణ చాలా వేగంగా పెరిగిపోయిందన్న విమర్శలున్నాయి. మొన్నటికి మొన్న కృష్ణా జిల్లాలో తీవ్రత తగ్గుతోందని జగన్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడేమో, కృష్ణా జిల్లాలో పరిస్థితి చెయ్యిదాటుతోంది.

గుంటూరు జిల్లాలో స్వయంగా ఓ మంత్రి మీద ఆరోపణలు వచ్చాయి.. కరోనా విస్తరణ విషయమై. సదరు మంత్రిగారి బంధువులే కరోనా వ్యాప్తికి కారణమయ్యారని ఆరోపణలు వస్తే.. అది రాజకీయ విమర్శ అని కొట్టి పారేశారు. ఇప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా వున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఆరోపణలన్నీ నిజమని అనలేం. కానీ, ప్రభుత్వం ఆరోపణలు వచ్చినప్పుడు అప్రమత్తమైతే ఇప్పుడు ఈ దుస్థితి వుండేది కాదు. విపక్షాల సూచనల్ని రాజకీయ విమర్శలుగా కొట్టి పారేసి, రాష్ట్రాన్ని ప్రమాదపుటంచుల్లోకి నెట్టేయడమంటే అంతకన్నా దారుణమైన విషయం ఇంకేముంటుంది.? ఇది కష్ట కాలం. ఎవరు ఏ సలహా ఇచ్చినా, విమర్శ చేసినా, ఆరోపణ చేసినా.. దాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.

సత్వరం ఆయా అంశాలపై స్పందిస్తే.. రాష్ట్రానికీ మేలు జరుగుతుంది.. ప్రజలకూ ‘మహమ్మారి’ నుంచి ఉపశమనం దొరుకుతుంది.. ప్రభుత్వానికీ మంచి పేరొస్తుంది. కానీ, ఇలా ‘లెక్క’ తప్పే పరిస్థితులు వస్తే మాత్రం.. అది ఎవరికీ మంచిది కాదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా వైరల్ అయింది. ప్రభాస్ పెళ్లి గురించే...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...