ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి సూచనలు, సలహాలు ఇవ్వాలంటూ ఓ కమిటీ, పత్రికా ప్రకటన విడుదల చేసింది. అదేంటీ, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కదా.? రాష్ట్ర అభివృద్ధి ఎలా చేయాలో ముఖ్యమంత్రికి తెలుసు కదా.! అనే డౌట్స్ మీకొస్తే, అది మీ తప్పు కానే కాదు.
చంద్రబాబు హయాంలో అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారు. కానీ, ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాబట్టి, రాజధానిని మార్చే ఆలోచన జరుగుతోంది. ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు అధికార పార్టీ నేతలు సెలవిచ్చారు. మంత్రి బొత్స సత్యనారాయణ అయితే, రాజధాని అమరావతిపై చల్లుతున్న బురద అంతా ఇంతా కాదు. అధికార పార్టీకి అమరావతిపై ఇంత క్లారిటీ వున్నప్పుడు, కొత్త కమిటీ అవసరమే లేదు. అసెంబ్లీలో తీర్మానం చేసేసి, రాజధానిని మార్చేయొచ్చు.
ఏ ప్రజల అభిప్రాయం తీసుకుని, రాష్ట్రంలో ఇసుక కొరత సృష్టించారు.? ఏ ప్రజల అభిప్రాయం తీసుకుని, మద్యం అమ్మకాల్ని ప్రభుత్వమే చేపట్టేలా చర్యలు తీసుకున్నారు.? ఏ ప్రజల ఆమోదం తీసుకుని కుప్పలు తెప్పలుగా సలహాదారులను నియమించుకుంటున్నారు.? ఏ ప్రజల సూచనల మేరకు టీటీడీ సభ్యుల్ని పెంచారు.. ఇలా చాలా ప్రశ్నలు పుట్టుకొస్తాయి.
అమరావతిపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఇది సుస్పష్టం. కానీ, రాజధాని మార్పు విషయమై ప్రజల నుంచి వ్యతిరేకత లేదని చెప్పుకోవాలి కాబట్టి, ఓ కాలయాపన కమిటీ వేశారన్నమాట. అంతకు మించి ఆ కమిటీకి విశ్వసనీయత వుంటుందని అనుకోలేం. ఏ అమరావతి నుంచి అయితే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పరిపాలన చేస్తున్నారో, ఆ అమరావతి పనులు ఐదు నెలల నుంచి ఆగిపోయాయంటే, రాష్ట్ర అభివృద్ధిపై వైఎస్ జగన్ ప్రభుత్వానికి ఎంత గొప్ప చిత్తశుద్ధి వుందో అర్థం చేసుకోవచ్చు.
262484 31178quite good post, i undoubtedly actually like this outstanding web site, carry on it 402707
125173 808928Nice article. It does shed some light on the concern. By the for those interested in binary options can get an exclusive binary options bonus. 902704
778111 678575Good web site. On your blogs really interest and i will tell a friends. 399976
127733 753366You created some 1st rate factors there. I seemed on the internet for the difficulty and located many people will go along with together along with your internet site. 527599