Vizag: దసరా తర్వాత సీఎం జగన్ (CM Jagan) పాలనను విశాఖపట్నం (Visakhapatnam) నుంచే కొనసాగించేందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేగవంతం చేసింది. విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయం, వసతి, మంత్రులు, సీనియర్ అధికారుల వసతికై మున్సిపల్, ఆర్ధిక, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీలతో కమిటీని నియమిస్తూ సీఎస్ కె.ఎస్.జవహర్ రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు.
ఉత్తర్వుల్లో పేర్కొన్న అంశాలను పరిశీలిస్తే.. ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి కోసం సీఎం సమీక్షలు చేయాల్సి ఉందని పేర్కొంది. ఇందుకు వసతి, ఆఫీస్ గుర్తింపు కోసం కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది. ఏపీ పునర్విభజన చట్టం.. అన్ని ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును సీఎం సమీక్షించాల్సి ఉందని.. అందుకు సీఎం విశాఖలో ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
సీఎం బస చేయాల్సి ఉన్నందున సీఎంఓలోని అధికారులకూ ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. ప్రభుత్వ విభాగాల కార్యదర్శులు, హెచ్ఓడీలు జిల్లాల్లో సమీక్షలు నిర్వహించాల్సి ఉందని వీరంతా విశాఖ లేదా పరిసర ప్రాంతాల్లో సొంతంగా వసతి చేసుకోవాలని కూడా స్పష్టం చేసింది.
I am actually thankful to the owner of this site who has
shared this great post at at this time.