దర్శకుడు పూరి జగన్నాధ్, మాజీ హీరోయిన్ ఛార్మి లపై కేసు పెడతానని అంటున్నాడు కమెడియన్ భద్రం. భద్రం గుర్తున్నాడుగా పలు సినిమాల్లో నటించి క్రేజ్ తెచ్చుకున్న భద్రంని వెండితెరకు పరిచయం చేసింది కూడా పూరి జగన్నాధ్. అదేంటి తన గురువు లాంటి పూరి పై కేసు పెట్టడం ఏమిటి అని షాక్ అవుతున్నారా?
అసలు విషయం ఏమిటంటే .. భద్రం కేసు పెట్టేది .. సీరియస్ గా కాదండోయ్ .. సరదాకే!! పూరి జగన్నాధ్ తాజాగా తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ ఇటీవలే విడుదలై మంచి వసూళ్లతో దూసుకుపోతుంది. ఈ సినిమా చుసిన భద్రం ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడట.
పూరి సర్, ఛార్మి మేడం పై నేను కేసు పెట్టబోతున్నాను .. దానికి కారణం నేను రోజు మెడిటేషన్ చేస్తాను. కానీ ఇస్మార్ట్ శంకర్ చూసినప్పటినుండి ధ్యానం చేయలేకపోతున్నాను. కాన్సన్ట్రేషన్ దెబ్బ తిన్నది. కొన్ని మెడిటేషన్ క్లాసులు కూడా మిస్ అయ్యాను అంటూ అందుకే కేసు పెడతానని చెప్పాడు. ఇస్మార్ట్ శంకర్ ని బాగా ఎంజాయ్ చేయండి అంటూ కామెంట్ పెట్టాడు. ఇస్మార్ట్ శంకర్ కేవలం మూడు రోజుల్లో 30 కోట్ల వరకు వసూళ్లు అందుకుంది. అది విషయం !!
979249 768883Which is some inspirational stuff. Never knew that opinions might be this varied. Thank you for all of the enthusiasm to give such helpful data here. 809874
451656 999588Very excellent post, thanks a whole lot for sharing. Do you happen to have an RSS feed I can subscribe to? 671943