రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత వేధిస్తోందని.. ఏపీకి 910 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్, 20 ఆక్సిజన్ ట్యాంకర్లను కేటియించాలని కోరుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ప్రస్తుతం అందుతున్న 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఏపీకి సరిపోవడం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం తమిళనాడు, కర్ణాటక నుంచి ఆక్సిజన్ దిగుమతి చేసుకుంటున్నాం. ఈనెల 10న చెన్నై, కర్ణాటక నుంచి రావాల్సిన ఆక్సిజన్ ఆలస్యం కావడంతో తిరుపతిలో 11 మంది చనిపోయారని వివరించారు.
ప్రస్తుతం కర్ణాటక నుంచి దిగుమతి చేసుకుంటున్న 20 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను 150కి, ఒడిశా నుంచి దిగుమతి చేసుకుంటున్న 210 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను 400కు పెంచాలని లేఖలో కోరారు. దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న భారత్ బయోటెక్ కోవాగ్జీన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు టెక్నాలజీ బదిలీ అంశాన్ని పరీశీలించాలని లేఖలో పేర్కొన్నారు. పెద్దమొత్తంలో వ్యాక్సిన్ ఉత్పత్తికి ఇతర కంపెనీలకు టెక్నాలజీని అందించే విషయంపై నిర్ణయం తీసుకోవాలని ప్రధానిని కోరారు.
204046 225978Sorry for the huge review, but Im truly loving the new Zune, and hope this, as properly as the exceptional reviews some other people have written, will assist you decide if its the proper choice for you. 853406
993715 824612I totally agree with you about this matter. Nice post. Already bookmarked for future reference. 133998