ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ కు ముందు రోజు నుంచి ఇప్పటివరకు కేంద్ర ఎన్నికల సంఘంపై టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తుతూనే ఉన్నారు. ఈసీతోపాటు సీఎస్ పైనా విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, వైఎస్సార్ సీపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపణలు గుప్పించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదీపై విరుచుకుపడిన ఆయన.. అనంతరం సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంపైనా విమర్శలు చేశారు. బీజేపీ చెప్పినట్టే ఎన్నికల సంఘం పనిచేస్తోందని, తాము ఫిర్యాదు చేస్తే పట్టించుకోని సీఈసీ.. వైఎస్సార్ సీపీ ఫిర్యాదు చేస్తే మాత్రం ఆగమేఘాల మీద నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించారు.
తాజాగా చంద్రగిరి నియోజకవర్గంలో రిగ్గింగ్ జరిగిందని నిర్ధారణ కావడంతో ఐదు కేంద్రాల్లో రీపోలింగ్ కు ఆదేశిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. దీంతో చంద్రబాబులో అసహనం మరింత పెరిగిపోయింది. ఈసీ తీరు ఏమాత్రం బాగోలేదని దుయ్యబట్టారు. ఈ విషయంపై మాట్లాడేందుకు ఢిల్లీ వెళ్లి, కేంద్ర ఎన్నికల కమిషనర్లను కలిశారు. రీపోలింగ్ ఎందుకు ఆదేశించారని నిలదీశారు. ఇలాంటి వ్యవహారం ఏదో జరిగే అవకాశం ఉందని భావించడంతో అప్పటికే పక్కా ఆధారాలు సిద్ధం చేసుకున్ని ఉన్న కమిషనర్లు.. వాటిని చంద్రబాబుకు చూపించారు.
పోలింగ్ కేంద్రాల్లో రిగ్గింగ్ ఎలా జరిగిందో చాలా స్పష్టంగా నమోదైన దృశ్యాలను చూపించేసరికి చంద్రబాబుకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయినట్టు సమాచారం. ఆయా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రిగ్గింగ్ వ్యవహారం మొత్తం రికార్డైంది. అధికార పార్టీకి చెందిన వ్యక్తులు బూత్ లను ఆక్రమించుకోవడం, అందుకు ఎన్నికల సిబ్బంది సహకరించడం, రిగ్గింగ్ చేసుకోవడం వంటి పరిణామాలన్నీ స్పష్టంగా ఆ వీడియో దృశ్యాల్లో నమోదయ్యాయి. వీటిని చూపించిన కమిషనర్లు.. రీపోలింగ్ పై నిర్ణయం తీసుకోవడం సబబా కాదా అని ఎదురు ప్రశ్నించినట్టు సమాచారం. దీంతో చంద్రబాబూ ఏమీ మాట్లాడలేకపోయారని తెలిసింది.
వాస్తవానికి ఏడు కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఫిర్యాదు అందిందని.. అయితే, రెండు కేంద్రాల్లో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో అక్కడ రీపోలింగ్ పై నిర్ణయం తీసుకోలేదని వివరించినట్టు సమాచారం. దీంతో చంద్రబాబు ఇక చేసేదేమీ లేక.. తాము ఇచ్చిన ఫిర్యాదులపై నిర్ణయం తీసుకోలేదని అడిగినట్టు తెలిసింది. అయితే, అందుకు సంబంధించిన ఆధారాలను సమర్పిస్తే.. తప్పకుండా పరిశీలిస్తామని ఈసీ చెప్పడంతో మౌనంగా వెనుదిరిగారని సమాచారం.
అయితే, మీడియాతో మాట్లాడినప్పడు మాత్రం షరా మామూలుగానే ఎన్నికల సంఘంపై విమర్శలు చేశారు. పోలింగ్ జరిగిన 25 రోజుల తర్వాత నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. ఇదంతా వివక్ష కాదా (ఈజ్ ఇట్ నాట్ వివక్షత?) అని ప్రశ్నించారు. కాగా, చంద్రగిరి నియోజకవర్గంలోని మరో రెండు కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఆదేశించింది. ఇప్పటికే ఎన్ఆర్ కమ్మపల్లి, పులవర్తివారిపల్లి, కొత్తకండ్రిగ, కమ్మపల్లి, వెంకటరామాపురం పోలింగ్ బూత్ లతో రీపోలింగ్ కు ఆదేశాలివ్వగా.. తాజాగా శనివారం కుప్పం బాదూరు, కాలూరు కేంద్రాల్లో కూడా రీపోలింగ్ నిర్వహించాలని ఆదేశించింది.
దీంతో ఆదివారం చంద్రగిరిలోని మొత్తం 7 కేంద్రాల్లో రీపోలింగ్ జరగనుంది. చంద్రబాబు సీఈసీని కలిసిన మరుసటి రోజు కొత్తగా మరో రెండు కేంద్రాల్లో రీపోలింగ్ కు ఆదేశాలు జారీకావడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
984134 504383Discovering the best Immigration Solicitor […]below youll discover the link to some websites that we think you need to visit[…] 16108
615459 86564Hey there! Excellent post! Please do tell us when we shall see a follow up! 85841
33419 310245Hey! Very good stuff, do tell us when you lastly post something like this! 62562
385733 625608Some truly good and beneficial information on this site, likewise I conceive the style holds exceptional features. 153175
728844 212873Hey, you used to write fantastic, but the last several posts have been kinda boring I miss your tremendous writings. Past couple of posts are just a bit bit out of track! come on! 620547
128833 418493There is noticeably a bundle to know about this. I assume you produced certain nice points in features also 588779
67219 722889Sweet site, super pattern , real clean and utilize genial . 597631