కేసుల మీద కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ ఆంధ్రప్రదేశ్ లోనే తల దాచుకున్నట్టు సమాచారం. టీవీ9 వాటాల వ్యవహారంలో అవకతవకలకు పాల్పడటంతోపాటు కంపెనీ సెక్రటరీ సంతకాన్ని ఫోర్జరీ చేసిన విషయంలో, టీవీ9 లోగోలను రూ.99 వేలకు అమ్మినట్టు కేసులు ఎదుర్కొంటున్న ఆయన.. గత కొంత కాలంగా పత్తా లేకుండా పోయిన సంగతి తెలిసిందే. పోలీసులు రెండు సార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ, రవిప్రకాష్ విచారణకు హాజరుకాలేదు. దీంతో ఆయన్ను అరెస్టు చేసే దిశగా పోలీసులు చర్యలు ప్రారంభించారు.
రవిప్రకాష్ పై ఆరోపణలు వచ్చిన రోజు సాయంత్రం టీవీ9 స్టూడియోలో అకస్మాత్తుగా ప్రత్యక్షమై.. తాను ఎక్కడికీ పారిపోలేదని, తాను ఇప్పుడు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లోని టీవీ9 కార్యాలయంలోనే ఉన్నానని, తన వార్తలు తానే చదువుతున్నానని పేర్కొన్నారు. తర్వాతి రోజు ఉదయాన్నే కార్యాలయానికి వచ్చి మధ్యాహ్నం వరకు అక్కడే ఉన్నారు. పోలీసులు వస్తున్నారనే సమాచారం తెలియడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎక్కడా కనిపించలేదు. ఫోన్ లో కూడా అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేసినప్పటికీ స్పందించలేదు. తనకు పది రోజుల గడువు కావాలని మాత్రం లాయర్ ద్వారా కబురు పంపించారు. కానీ పోలీసులు విచారణకు హాజరు కావాల్సిందేనని స్పష్టంచేసినా, రవిప్రకాష్ ఖాతరు చేయలేదు.
విచారణకు వస్తే తనను అరెస్టు చేస్తారనే అనుమానం ఉండటంతో ఆయన విచారణకు రావడంలేదని తెలుస్తోంది. అందువల్లే ముందస్తు బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ కూడా వేశారు. తాము రెండు సార్లు నోటీసులు జారీచేసినప్పటికీ స్పందించకపోవడంతో సైబరాబాద్ క్రైమ్ పోలీసులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. తాజాగా రవిప్రకాష్ తోపాటు ఆయన సన్నిహితుడు, సినీనటుడు, గరుడ పురాణంతో ఫేమస్ అయిన శివాజీపై లుకౌట్ నోటీసులు జారీచేశారు. వీరిద్దరూ దేశం విడిచి వెళ్లిపోకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటికే రవిప్రకాష్ పాస్పోర్టును సీజ్ చేసిన పోలీసులు.. తాజాగా ఆయనపై లుకౌట్ నోటీసులు జారీచేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో వీరిద్దరినీ ఏ క్షణంలోనైనా అరెస్టు అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం రవిప్రకాష్ ఎక్కడ ఉన్నారో పోలీసులు ఆరా తీస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆయన ఆంధ్రప్రదేశ్ నే తన షెల్టర్ జోన్ గా ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వ పెద్దల సహకారంతో ఆయన సురక్షితమైన ప్రదేశంలో ఉన్నట్టు సమాచారం. రవిప్రకాష్ ప్రకాశం జిల్లాలోని ఓ రిసార్టులో ఉన్నాడంటూ అందిన సమాచారాన్ని రూఢీ చేసుకునే పనిలో సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు నిమగ్నమైనట్టుగా తెలుస్తోంది.
అయితే, వీరు ఈ విషయాన్ని నిజమో కాదో నిర్ధారించుకుని అక్కడకు వెళ్లేసరికి రవిప్రకాష్ మాయం అయ్యే అవకాశం లేకపోలేదని అంటున్నారు. అక్కడి ప్రభుత్వ పెద్దలు సహకరించినంత కాలం రవిప్రకాష్ ను అదుపులోకి తీసుకోవడం కష్టమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక ఐదు రోజుల్లో ఏపీ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. టీడీపీ విజయం సాధిస్తే రవిప్రకాష్ సేఫ్ జోన్ లో ఉండే అవకాశం ఉంటుంది. అలా కాకుండా జగన్ అధికారంలోకి వస్తే మాత్రం ఆయనకు కష్టకాలం తప్పదు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడున్నా పోలీసులు అరెస్టు చేయడం ఖాయం. ఈలోగా ముందస్తు బెయిల్ తీసుకుంటే అరెస్టు కాకుండా తప్పించుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఆయన ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు.
737766 520388Hi there! Do you use Twitter? Id like to follow you if that would be ok. Im undoubtedly enjoying your blog and appear forward to new posts. 661633
615006 172531I dont normally take a look at these kinds of web sites (Im a pretty shy person) – but even though I was a bit shocked as I was reading, I was undoubtedly a bit excited as well. Thanks for giving me a big smile for the day 174803