చంద్రబాబు నాయుడిని అందరూ అపరచాణక్యుడు, ఎలాంటి సమస్య వచ్చినా తనదైన తెలివితో వాటిని క్షణాల్లోనే పరిష్కరించే సత్తా దేశంలో బాబుగారికి తప్పించి మరెవ్వరికీ లేదని అంటుంటారు. ఇలాంటి మాటలు బాబుగారిదగ్గర మాట్లాడితే వారిని ఉన్నత పదవులు ఇచ్చి అందలం ఎక్కిస్తుంటారు.. రాజకీయాల్లో భజన సంఘాలు అన్నవి కామన్ వీటిని కోసం ప్రత్యేకంగా కొందర్ని నియమించుకొని భజన చేయించుకుంటుంటారు.. వీటికోసం ఎక్కువగా ఖర్చు చేస్తుంటారు. ఈ భజన బ్యాచ్ మీడియాలో కావాల్సినంత భజన చేస్తూ మైలేజ్ తీసుకొస్తుంది ఫలితంగా దేశంలో ఆ వ్యక్తిని గుర్తింపు లభిస్తుంది..
ఈ విషయంలో బాబుగారు అందరికంటే ముందు ఉంటారనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు.. ఆయన తన పలుకుబడితో తనపై వచ్చిన వచ్చే ఆరోపణల నుంచి, కేసుల నుంచి బయటపడటానికి బాబుగారు పలుకుబడిని అడ్డం పెట్టుకొని తప్పించుకోవడంలో అందెవేసిన చేయి. ఈ తెలివి ఇప్పటికాదు… 2005 నుంచే అయన ఇలాంటి తెలివితేటలను ప్రదర్శించాడు. ఇలాంటి తెలివి ప్రదర్శించాడు కాబట్టే వాజ్ పాయ్ హయాంలో ఎన్డీఏ కన్వీనర్ గా, మోడీ హయాంలో స్వచ్ఛభారత్ మిషన్ కు చైర్మన్ గా వ్యవహరించాడు.
దేశంలో ఒక మంచి పని జరుగుతుంది అంటే దాని వెనుక బాబుగారి హస్తం ఉంది అనే విధంగా మీడియాలో క్రియేట్ చేయగల సమర్ధుడు..అయితే, అన్నిసమయాలు.. అన్నికాలాలు ఒకేవిధంగా ఉండవు కదా.. గ్రహస్థితి అనుకూలంగా ఉన్నంతవరకు అంతాబాగానే జరుగుతుంది. కానీ, గ్రహస్థితి బాగాలేకుంటే.. జరిగే పరిణామాలు వేరుగా ఉంటాయి. ఇప్పుడు బాబుగారి విషయంలో అదే జరుగుతున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది.
2005లో లక్ష్మీపార్వతి బాబుగారిపై ఏసీబీ కోర్టులో కేసు వేసింది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాబు ఆదాయానికి మించిన ఆస్తులను కలిగి ఉన్నారు అని కేసు పెట్టింది. మరి బాబు అపారమైన మేధస్సు కలిగిన వ్యక్తికదా..ఎంక్వైరీ జరిగితే ఎక్కడ ఇరుక్కోవలసి వస్తుందో అని చెప్పి బాబు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నాడు.. అప్పటి నుంచి ఆ స్టే కంటిన్యూ అవుతూనే ఉన్నది.
అయితే, సుప్రీం కోర్టు ఇలాంటి విషయంలో ఓ తీర్పు ఇచ్చింది.. సివిల్, క్రిమినల్ కేసుల్లో ఆరునెలలకు మించి స్టే విధించేందుకు చట్టం ఒప్పుకోదని, ఆరునెలల తరువాత స్టే ఆటోమాటిక్ గా రద్దవుతుదని తీర్పులో పేర్కొంది. ఈ తీర్పును బేస్ చేసుకొని మళ్ళీ లక్ష్మి పార్వతి బాబుపై పెట్టిన కేసును తిరగతవ్వింది. ఏసీబీ కోర్టు కూడా ఈ కేసును ముందుకు తీసుకెళ్లేందుకు సిద్దమైన సంగతి తెలిసందే. దీంతో బాబుగారికి కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి.
అప్పట్లో అధికారంలో ఉండగా అత్తగారిని నానా మాటలు మాట్లాడిన బాబుపై ఇప్పుడు పగ తీర్చుకోబోతున్నదా అంటే.. అవుననే చెప్పొచ్చు. ఆదాయానికి మించిన ఆస్తుల విషయంలో ఎంక్వైరీ అంటే బాబు ఎందుకో భయపడుతున్నాడు. అన్ని సరిగ్గా ఉంటె భయపడాల్సిన అవసరం ఏముంది. సచ్చిలుడైతే కోర్టు కేసులు ఎదుర్కోవచ్చు కదా..
759762 610835You could certainly see your enthusiasm within the paintings you write. 56125