ఆంధ్రప్రదేశ్లో పరిపాలనా వికేంద్రీకరణ ఏమవుతుంది.? కేంద్రం, రాష్ట్రానికి బాసటగా నిలుస్తుందా.? మోకాలడ్డుతుందా.? ఈ అంశాలపై ఇంకా సందిగ్ధం కొనసాగుతోంది. నిజానికి శాసనమండలి వ్యవహారమ్మీదనే వివాదం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ‘మా దృష్టిలో శాసన మండలి ఇప్పుడు ఉనికిలో లోనట్టే..’ అని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు.
అసెంబ్లీలో శాసన మండలి రద్దుపై తీర్మానం జరగడం, ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపినట్లు వైసీపీ నేతలు చెబుతుండడం తెలిసిన విషయాలే. అయితే, మండలి రద్దుకి సంబంధించి ఎలాంటి సమాచారం కేంద్రానికి చేరలేదని సాక్షాత్తూ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా అంతా విస్తుపోవాల్సి వచ్చింది.
కేంద్ర హోంశాఖతోపాటు, సంబంధిత శాఖలకు శాసన మండలి రద్దు బిల్లుని పంపినట్లుగా ఏపీ ప్రభుత్వ వర్గాలు చెబుతున్న విషయం విదితమే. పరిపాలనా వికేంద్రీకరణ విషయంలోనూ కేంద్రానికి సమాచారం లేదని కిషన్రెడ్డి తేల్చి చెప్పేశారు. ‘ఒక రాష్ట్రానికి ఒకే రాజధాని వుండాలి.. ఇది బీజేపీ రాష్ట్ర పార్టీ విధానం. వైఎస్ జగన్ తన మూడు రాజధానుల ఆలోచనను విరమించుకుంటే మంచిది..’ అంటూ ఓ సున్నితమైన హెచ్చరికలాంటి సలహా కూడా కిషన్రెడ్డి ఇచ్చేయడం గమనార్హం.
అయితే, వైఎస్ జగన్ ప్రభుత్వం మాత్రం పరిపాలనా వికేంద్రీకరణ దిశగా తన ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. ‘పరిపాలనా సౌలభ్యం కోసం’ అటు కర్నూలుకీ, ఇటు విశాఖకీ కీలక శాఖల తరలింపు ప్రక్రియ చేపడ్తోంది. దీనికి సంబంధించి మౌఖిక ఆదేశాలతోపాటు, అధికారిక ఆదేశాలు కూడా ఆయా శాఖలకు అందుతుండడంతో, రాజధాని అమరావతి ప్రాంతంలో అలజడి మరింత తీవ్రతరమవుతోంది.
అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం శాసన మండలి రద్దు సహా, పరిపాలన వికేంద్రీకరణ విషయాల్లో కేంద్ర ప్రభుత్వ పెద్దలు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఏమాత్రం సానుకూలంగా లేరని తెలుస్తోంది.
497820 39486Extremely nice style and style and great subject matter, extremely small else we want : D. 856562
342971 302002It is difficult to acquire knowledgeable individuals about this topic, and you sound like what happens you are speaking about! Thanks 299971
217222 346238great post. Neer knew this, regards for letting me know. 330810