అక్రమ సంబంధం మోజు ఎంతటి ఘోరాలకు తెర తీస్తుందో ఇప్పటికే పలు సందర్బాల్లో నిరూపితం అయ్యింది. అక్రమ సంబంధం మోజుతో ప్రాణాలు బలిగొన్నారు. ఇప్పుడు అక్రమ సంబంధం మోజుతో ఏడాదిన్నర బాలుడిని ఒక వ్యక్తి అత్యంత కిరాతకంగా హత్య చేయడం జరిగింది. సరూర్ నగర్ పోలీస్ ల కథనం మేరకు మద్దికుంట రాజు వివాహితతో అక్రమ సంబంధంను కొనసాగించేందుకు ఆమె కొడుకును హత్య చేశాడు. విషయం ను మొదట దాచాలని చూసినా కూడా పోలీసులు తమదైన శైలిలో ఎంక్వౌరీ చేయడంతో హత్య ఒప్పుకున్నాడు.
పోలీసులు బాధితుల కథనం ప్రకారం.. భర్త అజయ్ తో గొడవ పడి భార్య మౌనిక దూరంగా ఉంటుంది. వీరికి 18 నెలల బాబు ఉన్నాడు. బాబుతో కలిసి రాజు తో దిల్సుఖ్ నగర్ లో సహజీవనం సాగిస్తుంది. ఇద్దరి మద్య బాబు అడ్డుగా ఉన్నాడనే కారణంతో మౌనిక బయటకు వెళ్లిన సమయంలో రాజు బాలుడిని చాతిపై బలంగా కొట్టాడు. దాంతో నోటి నుండి నురుగ కక్కి చనిపోయాడు. ఫిడ్స్ తో బాలుడు కొట్టుకుంటున్నాడు అంటూ చుట్టుపక్కల వారిని నమ్మించాడు. మౌనికకు విషయం చెప్పాడు. కన్నీరు మున్నీరైన మౌనిక భర్త అజయ్ కి విషయం చెప్పడంతో అనుమానంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు పోస్ట్ మార్టం రిపోర్ట్ ను తెప్పించుకుని చూసి బలంగా కొట్టడం వల్ల చనిపోయినట్లుగా గుర్తించారు. దాంతో రాజును ప్రశ్నించడంతో హత్య చేసినట్లుగా ఒప్పుకున్నాడు.
798763 716602You should be very astute at research and writing. This shows up within your original and special content. I agree with your primary points on this topic. This content should be seen by a lot more readers. 15983
161890 393748Just a smiling visitor here to share the love (:, btw outstanding layout. 259988