‘రాజధాని ఏ సామాజిక వర్గానికీ సంబంధించింది కాదు.. ఏ సామాజిక వర్గానికో అది పరిమితం కాదు..’ అంటూ పదే పదే వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ నినదిస్తున్నారు. రాజధాని అందరిదీ.. రాజధాని అనేది ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. రాజధాని అంటే గుర్తింపు.. రాజధానితోనే అభివృద్ధి. ఓ సీనియర్ పొలిటీషియన్గా రాజధాని ప్రాముఖ్యత ఏంటో బొత్స సత్యనారాయణకి తెలియదని అనుకోలేం.
కానీ, ఎందుకో బొత్స సత్యనారాయణ రాజధాని అమరావతి అంశాన్ని వివాదం చేయాలనుకుంటున్నారు. లేకపోతే, కృష్ణా నది వరదల్తో రాజధాని అమరావతి మునిగిపోయిందంటూ అబద్ధాలు చెప్పడమేంటి.? ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధాని మారిపోవాల్సి వస్తే.. అంతకన్నా దుర్మార్గం ఇంకొకటుండదు. పైగా, రాజధానికీ.. సామాజిక వర్గ కోణానికీ ముడిపెడుతున్నారు బొత్స సత్యనారాయణ. ఆయన మాటల్లోని ఉద్దేశ్యం సుస్పష్టం.
రాజధాని అమరావతిని చంద్రబాబు ప్రకటించారు గనుక.. అది ‘కమ్మ’ రాజధాని అన్నమాట. మరి, ఇంకో రాజధానిని వైఎస్ జగన్ ప్రభుత్వం ఖరారు చేస్తే.. దాన్ని ‘రెడ్డి’ రాజ్యం అని తెలుగుదేశం పార్టీ విమర్శించకుండా వుంటుందా.? ఇలా విమర్శించుకుంటూ పోతే, రాజధాని అనేది ఆంధ్రప్రదేశ్కి సమీప భవిష్యత్తులో అయినా వుంటుందా.? లేదా.? ఇదే ప్రశ్న ఇప్పుడు రాష్ట్ర ప్రజానీకంలో తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది.
మరోపక్క, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బొత్స సత్యనారాయణ పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ సమయంలో రాష్ట్ర విభజనకు పూర్తిస్థాయిలో సహకరించారాయన. అదే బొత్స సత్యనారాయణ, రాష్ట్ర విభజనతో నష్టం జరిగిందనీ.. అంతకన్నా ఎక్కువ నష్టం చంద్రబాబు హయాంలో జరిగిందనీ సెలవిస్తున్నారు. ఇదీ బొత్స సత్యనారాయణ చిత్తశుద్ధి. ఆయన నోట రాజధాని అమరావతి మీద విషం చిమ్మేలా చేయిస్తున్నదెవరు.? ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి వైఎస్ జగన్, రాజధాని అమరావతి విషయంలో ఎందుకు పెదవి విప్పడంలేదు.!
41432 146734Having a look forward to peer you. 986539